దర్శకుడు క్రిష్ … పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతోన్న “హరి హర వీరమల్లు” నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు ఆ సినిమాని నిర్మాత ఏ. ఎం. రత్నం కుమారుడు జ్యోతికృష్ణ పూర్తి చెయ్యనున్నారు. ఈ విషయాన్ని నిన్న (మే 2, 2024)న నిర్మాతలు ప్రకటించారు. కొత్త టీజర్ కూడా వచ్చింది.
ఐతే, దీని గురించి క్రిష్ అస్సలు పట్టించుకోలేదు. కొత్త టీజర్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యలేదు. తాను ఈ సినిమా నుంచి తప్పుకున్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు.
“హరి హర వీరమల్లు” సినిమా మొదటి నుంచి అనేక సమస్యలు ఎదుర్కొంది. ఈ సినిమా కరోనా కాలం కన్నా ముందే మొదలైంది. కానీ, ఈ సినిమాకి డేట్స్ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్”, “బ్రో” సినిమాలు పూర్తి చేశారు. దాంతో, విసుగెత్తిన క్రిష్ సినిమా నుంచి తప్పుకున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ “కొండపొలం” అనే సినిమా విడుదల చేశారు. ఇప్పుడు అనుష్క హీరోయిన్ గా “గాటి” అనే సినిమా తీస్తున్నారు.
నిర్మాత రత్నం, హీరో పవన్ కల్యాణ్ లతో క్రిష్ కి తీవ్రమైన గొడవలు లేదా అభిప్రాయ వైరుధ్యాలు ఉన్నట్లు అర్థం అవుతోంది.
పైగా క్రిష్ కి ఈ మధ్య విజయాలు లేవు. ఆయన గత చిత్రాలు “ఎన్టీఆర్: మహానాయకుడు”, “కొండపొలం” వంటివి దారుణ పరాజయం పాలు అయ్యాయి. సో, క్రిష్ కూడా ‘డిమాండ్’లో లేడు.
రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More