జనసేన అధినేత, ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ కి ఓటమి భయం పట్టుకొంది అని అంటున్నారు యాంకర్ శ్యామల. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విషయం మనకు తెలుసు. ఇప్పటికే హోరుగా ప్రచారం సాగుతోంది. పవన్ కళ్యాణ్ తరఫున ఆయన కుటుంబ హీరోలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు.
పిఠాపురంలో ఎక్కడా చూసిన జనసేన జెండాలే కనిపిస్తున్నాయి. జనం నుంచి కూడా స్పందన బాగుందనేది టాక్. ఈసారి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అని జనసేన వర్గాలు చెపుతున్నాయి.
ఐతే, శ్యామల మాత్రం పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఓడిపోతారు అని అంటున్నారు. వైసీపీ నాయకురాలు వంగా గీత పవన్ కళ్యాణ్ పై గెలుస్తారు అనేది ఆమె అభిప్రాయం.
“పవన్ కళ్యాణ్ కి ఓడిపోతాననే భయం పట్టుకోవడం వల్లే రోజుకో తమ కుటుంబ హీరోని పిఠాపురం రప్పించి ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కున్న ఇమేజ్ ప్రకారం ఎవరూ ప్రచారం చేయకున్నా గెలవాలి కదా. ఈ హీరోల ప్రచారం బట్టే అర్థం అవుతోంది ఆయన భయం ఎలా ఉందో” అనే వాదన వినిపిస్తున్నారు శ్యామల.
శ్యామల చాలాకాలంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి మద్దతుదారుగా ఉన్నారు. ఈ సారి కూడా ఆమె వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఆమె పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి గీత తరఫున ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ పై ఈ కామెంట్స్ చేశారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More