కమల్ హాసన్, మణిరత్నం కలిసి చేసిన సినిమా ‘థగ్ లైఫ్’. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘ జింగుచా’ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు కమల్ హాసన్.
మణిరత్నం నిర్మించిన కోలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘పొన్నియిన్ సెల్వన్’ ను మొదట తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పై నిర్మించాలనుకున్నారు కమల్. కానీ అనుకోని కారణాల వల్ల మిస్సయిందంట. కట్ చేస్తే, ఈ సినిమా పార్ట్-1 దాదాపు 500 కోట్ల గ్రాస్ వసూలు చేసి కోలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రెండవ భాగం కూడా దాదాపు 350 కోట్లు వసూలు చేసి సక్సెస్ ఫుల్ వెంచర్ అనిపించుకుంది.
అలా తను 500 కోట్ల రూపాయల చిత్రాన్ని మిస్ చేసుకున్నానని అన్నారు కమల్. ఇక ‘థగ్ లైఫ్’ విషయానికొస్తే, ఈ సినిమా స్టోరీలైన్ ను మణిరత్నంకు ఇచ్చారంట కమల్. దాన్ని మణిరత్నం డెవలప్ చేశారంట.
అలా ‘థగ్ లైఫ్’ ప్రాజెక్టు సెట్ అయిందన్నారు. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని, కానీ ఒక్కరు కూడా తనకు ఐ లవ్ యు చెప్పలేదంటూ సరదాగా వ్యాఖ్యానించారు లోకనాయకుడు.
అప్పట్లో తెల్లచీరకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది శ్రీదేవి. ఆమె తెల్లచీర కడితే ప్రేక్షక లోకం ఊగిపోయేది. ఆ తర్వాత… Read More
త్రివిక్రమ్-చరణ్ కాంబినేషన్ పై ఇటీవల వార్తలొచ్చాయి. తెలుగుసినిమా.కామ్ ఎక్స్ క్లూజివ్ గా రాసింది కూడా. బన్నీతో సినిమా ఇప్పట్లో లేకపోవడంతో…… Read More
నటుడు రఘుబాబు పాటలు కూడా పాడాడట. కాకపోతే ఎవరి సంగీత దర్శకత్వంలో పాటలు పాడారో ఆయనకే తెలియదు. లేదా మర్చిపోయారు.… Read More
"వార్ 2" టీజర్లో కియారా అద్వానీ బికినీ షాట్ చూసి కుర్రాళ్లు మతి పోగొట్టుకున్నారు. సాధారణ ప్రేక్షకులు, యువకులు ఆమె… Read More
తమిళ హీరో రవి మోహన్ విడాకుల కేసు కోర్టుకి చేరుకొంది. భార్య ఆర్తితో ఉండడం సాధ్యం కాదని రవి కోర్టుకు… Read More
ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా "వార్ 2" టీజర్ రాబోతుంది అని ఆ… Read More