కమల్ హాసన్, మణిరత్నం కలిసి చేసిన సినిమా ‘థగ్ లైఫ్’. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘ జింగుచా’ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు కమల్ హాసన్.
మణిరత్నం నిర్మించిన కోలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘పొన్నియిన్ సెల్వన్’ ను మొదట తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పై నిర్మించాలనుకున్నారు కమల్. కానీ అనుకోని కారణాల వల్ల మిస్సయిందంట. కట్ చేస్తే, ఈ సినిమా పార్ట్-1 దాదాపు 500 కోట్ల గ్రాస్ వసూలు చేసి కోలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రెండవ భాగం కూడా దాదాపు 350 కోట్లు వసూలు చేసి సక్సెస్ ఫుల్ వెంచర్ అనిపించుకుంది.
అలా తను 500 కోట్ల రూపాయల చిత్రాన్ని మిస్ చేసుకున్నానని అన్నారు కమల్. ఇక ‘థగ్ లైఫ్’ విషయానికొస్తే, ఈ సినిమా స్టోరీలైన్ ను మణిరత్నంకు ఇచ్చారంట కమల్. దాన్ని మణిరత్నం డెవలప్ చేశారంట.
అలా ‘థగ్ లైఫ్’ ప్రాజెక్టు సెట్ అయిందన్నారు. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని, కానీ ఒక్కరు కూడా తనకు ఐ లవ్ యు చెప్పలేదంటూ సరదాగా వ్యాఖ్యానించారు లోకనాయకుడు.
హీరోయిన్ శృతిహాసన్, సోషల్ మీడియాకు శెలవు పెట్టింది. కొన్నాళ్ల పాటు తను సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నానని, నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తానని… Read More
మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ కు బెయిల్ దొరికింది. ఈ నటుడికి షరతులతో కూడిన… Read More
కియరా ప్రస్తుతం గర్భవతి అనే విషయం తెలిసిందే. దీంతో ఆమె కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరీ… Read More
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ … ఒక టైంలో తెలుగు సినిమాకి నాలుగు స్తంభాలుగా… Read More
అనుపమ పరమేశ్వరన్ నటించిన ఒక మలయాళ చిత్రం "జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ" ఇంతవరకు విడుదల కావడం లేదు.… Read More
6 నెలలు గడిచిపోయాయి. వెనక్కు తిరిగి చూస్తే ఇప్పటికీ 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా మాత్రమే కనిపిస్తోంది. ఈ మూవీ… Read More