‘శ్వాగ్’ సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేశాడు శ్రీవిష్ణు. దాదాపు అన్ని పాత్రలు అతడే పోషించగా, అందులో కీలకమైన రెండు పాత్రల కోసం రీతూ వర్మ, దక్ష నగార్కర్ ను హీరోయిన్లుగా తీసుకున్నాడు. ఇప్పుడు తన నెక్ట్స్ మూవీకి కూడా ఇద్దరు హీరోయిన్లను తీసుకున్నాడు ఈ హీరో.
కార్తీక్ దర్శకత్వంలో ఎప్పట్లానే సైలెంట్ గా ఓ సినిమా పూర్తి చేస్తున్నాడు శ్రీవిష్ణు. గతంలో ‘నిను వీడని నీడను నేను’ అనే చిత్రంతో ఆకట్టుకున్న ఈ దర్శకుడు.. ఇప్పుడు శ్రీవిష్ణుతో మరో డిఫరెంట్ స్టోరీని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో హీరోయిన్లుగా ఇవానా, కేతిక శర్మను తీసుకున్నారు.
కెరీర్ లో ఛాన్సుల్లేక ఇబ్బంది పడుతున్న కేతిక శర్మకు ఇది నిజంగా మంచి అవకాశంగానే చెప్పాలి. ఇక ఇవానా అయితే ‘లవ్ టుడే’ సక్సెస్ తర్వాత తెలుగులో నిర్మాత శిరీష్ కొడుకు ఆశిష్ సరసన ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ “సెల్ఫీస్” అనే సినిమా దాదాపుగా ఆగిపోయింది. అది విడుదల అవుతుందో లేదో కూడా తెలియదు. సో, శ్రీవిష్ణుతో మూవీ ఆమెకి మొదటి తెలుగు సినిమా అయ్యేలా ఉంది.
అలా ఈ ఇద్దరు హీరోయిన్లతో కలిసి సినిమాను పూర్తి చేస్తున్నాడు శ్రీవిష్ణు. దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాకు అల్లు అరవింద్ ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నారు.
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More