హీరోయిన్ శిల్పాశెట్టికి వందల కోట్ల ఆస్తి ఉంది. ఆమె బాగా సంపాదించింది. ఐతే, ఇప్పుడు ఆమె ముంబైలో నివసిస్తున్న జుహూ ఇంటిని ఈడీ ఒక కేసులో అటాచ్ చేసింది.
శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా మనీ లాండరింగ్ కేసు చాలా కాలంగా ఎదుర్కుంటున్నారు. ఈ కేసులో ఈ రోజు రాజ్ కుంద్రా, ఆయన భార్య శిల్పాశెట్టికి చెందిన పలు ఆస్తులను జప్తు చేసింది.
“ED ముంబై ఈ రోజు రిపు సుదన్ కుంద్రా అలియాస్ రాజ్ కుంద్రాకు చెందిన 97.79 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. PMLA, 2002 నిబంధనల ప్రకారం అటాచ్ చేసిన ఆస్తులలో ప్రస్తుతం జుహులో శ్రీమతి శిల్పాశెట్టి పేరు మీద ఉన్న రెసిడెన్షియల్ ఫ్లాట్ కూడా ఉంది,” ఈడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
శిల్పాశెట్టి చాలా ఏళ్ల క్రితమే ముంబైలో, పుణేలో స్థలాలు కొనుక్కొంది. ముంబైలో ధనవంతుల ఏరియాగా పేరొందిన అత్యంత ఖరీదైన జుహూ ప్రాంతంలో ఆమె ఉంటోంది. ఆ ఇంటిని ఇప్పుడు ఈడి ఈ కేసుకు అటాచ్ చేసింది. నేరం నిరూపితం ఐతే ఈ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ కేసు నడుస్తోంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More