వీరాభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్, ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. మొన్నటివరకు అతడు బెంగళూరులోని పరప్పర అగ్రహార జైలులో ఉండేవాడు.
ఆ జైలులో అతడికి రాజభోగాలు దక్కాయి. దాదాపుగా హీరో ట్రీట్ మెంట్ ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించి కొన్ని ఫొటోలు బయటకురావడంతో హుటాహుటిన దర్శన్ ను బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించారు.
అయితే పరప్పర అగ్రహార జైలు నుంచి దర్శన్ వెళ్లిపోయినా, ఆ జైలుపై అధికారుల నిఘా మాత్రం తగ్గలేదు. తాజాగా ఆ జైలులో అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. దీంతో ఆ జైలు అసలు స్వరూపం బయటపడింది.
ఏకంగా జైలులో 15 ఫోన్లు దొరికాయి. వీటిలో లక్షా 30వేల రూపాయల ఖరీదైన శాంసంగ్ ఫోన్ కూడా ఉంది. 7 ఎలక్ట్రిక్ స్టవ్ లు, 10కి పైగా పెన్ డ్రైవ్ లు దొరికాయి. వీటితోపాటు 5 కత్తులు కూడా దొరికాయి. 36వేల రూపాయల డబ్బుతో పాటు.. లెక్కలేనన్ని సెగరెట్ ప్యాకెట్లు, బీడీ ప్యాకెట్లు, అగ్గిపెట్టెలు దొరికాయి. ఇవన్నీ చూసిన అధికారులు అవాక్కయ్యారు.
రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More