చాలామంది ఇష్టంతో దర్శకులుగా మారతారు. కానీ దర్శకుడు బాబి మాత్రం కోపంతో దర్శకుడిగా మారానంటున్నాడు. ఇంతకీ అతడికి అంత కోపం ఎందుకు?
“రచయితగా లైఫ్ చాలా బాగుంటుంది. ఏసీలో కూర్చోవచ్చు, ఎండలోకి రానక్కర్లేదు. రైటర్ గా చేసినప్పుడు నేను బాగా ఎఁజాయ్ చేశాను. కాకపోతే నాకు ఒకటే కోపం. నన్ను ఎవ్వడూ గుర్తించట్లేదు. నాలుగు గోడల మధ్య విపరీతమైన గౌరవం వస్తోంది. కానీ ప్రెస్ ముందు దర్శకులు నా గురించి మాట్లాడ్డం లేదు. అది వాళ్ల తప్పు కూడా కాదు. ఆ కోపంతోనే నేను దర్శకుడిగా మారాను. ఆ కోపం నుంచే ‘పవర్’ అనే సినిమా చేశాను. నిజంగా నాకు రైటర్ గా మీడియా ముందు కూడా రెస్పక్ట్ ఇచ్చినట్టయితే, నేనసలు దర్శకుడిగా మారేవాడ్ని కాదు. నా భార్యకు కూడా పెద్ద కోరికల్లేవ్, హ్యాపీగా ఉండేవాళ్లం.”
ఇలా తన దర్శకుడిగా మారడం వెనక కథను బయటపెట్టాడు బాబి కొల్లి. బాలకృష్ణతో ‘డాకు మహారాజ్’ సినిమా తీసిన ఈ దర్శకుడు, ఆ సినిమా ప్రచారంలో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలిస్తున్నాడు. ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని కూడా వెల్లడించాడు.
ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ‘యానిమల్’ సినిమా హిట్టయిన తర్వాత ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు బాబీనీ ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నారని అంతా అనుకుంటున్నారు. అయితే బాబీ మాత్రం, యానిమల్ సినిమా రిలీజ్ కంటే ముందే బాబీకి ఈ కథ వినిపించాడట. ‘యానిమల్’ రిలీజ్ తర్వాత కూడా బాబీ డియోల్ ఈ పాత్ర చేయడానికి అంగీకరించాడంటే, ఆ క్యారెక్టర్ లో ఉన్న లోతును అంతా అర్థం చేసుకోవాలంటున్నాడు బాబి.
రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More