ఈ ఏడాది (2024)లో మీనాక్షి చౌదరి ఏకంగా ఆరు సినిమాల్లో నటించింది. అందులో అయిదు విడుదల అయ్యాయి. ఆమె 2024లో నటించిన ఆరో చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం.” ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14, 2025న థియేటర్లలోకి రానుంది.
ఈ మొత్తం అరడజను చిత్రాల్లో ఆడిన ఒకే ఒక్క చిత్రం.. లక్కీ భాస్కర్.మిగతావన్నీ ఫ్లాపులు. ఆమె నటించిన ఒక తమిళ్ చిత్రం (గోట్) వసూళ్లు సాధించింది కానీ ఆమెని ఎవరూ పట్టించుకోలేదు. “గుంటూరు కారం”లో ఆమె పాత్ర జూనియర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ సైడ్ క్యారెక్టర్ కి తక్కువ. ఇక ఇతర చిత్రాలైన మెకానిక్ రాకీ, మట్కా దారుణంగా పరాజయం పాలు అయ్యాయి.
అయినా ఆమెకి ఇంకా కొత్తగా అవకాశాలు వస్తుండడం విశేషం. తాజాగా ఆమెని “అనగనగా ఒక రాజు” చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారు. అంటే 2025లో కూడా కూడా “సంక్రాంతికి వస్తున్నాం”, “అనగనగా ఒక రాజు” అనే రెండు చిత్రాలు విడుదల అవుతాయి. మరో ఒకటో, రెండో కొత్త చిత్రాలు కూడా ఆమె వళ్ళో వాలుతాయి. ఆ లెక్కన 2025లో కూడా మూడు, నాలుగు చిత్రాలు చేసినట్లు అవుతుంది. అంటే ఆమె ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆఫర్లు తెచ్చుకుంటోంది.
ఆమె ఇప్పటివరకు నటించిన ఏ సినిమాల్లో కూడా గ్లామరస్ గా కనిపించలేదు. నటన కూడా గొప్పగా చేసింది లేదు. అయినా ఆఫర్లు వస్తున్నాయంటే గ్రేట్.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More