కంగనా రనౌత్ తన మాట తీరుతో ఎంపీ అయింది. బీజేపీ పెద్దలను మెప్పించింది. ఐతే ఇదంతా గతం. కేంద్రంలో మోదీ ప్రభుత్వం మునుపటిలా బలంగా లేదు. మిత్రపక్షాల మీద ఆధారపడి ఉంది. అందుకే, ఇప్పుడు మితిమీరి మాట్లాడే తమ పార్టీ నాయకులపై చర్యలు తీసుకుంటోంది.
అలా తాజాగా కంగనా రనౌత్ కి బీజేపీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. పార్టీ పాలసీ విషయాలపై మాట్లాడే అధికారం, అనుమతి ఆమెకు లేదని స్పష్టం చేసింది అధిష్టానం.
రైతుల ఉద్యమానికి సంబంధించి ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. నార్త్ ఇండియాలో పార్టీని ఇబ్బంది పెట్టెలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. దాంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. కంగన స్థాయిని కుదించి నష్ట నివారణ చేపట్టింది.
కంగన మంత్రి పదవి కూడా దక్కుతుందని ఆశించింది. కానీ యిప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. ఆమె మునుపటిలా ఏది పడితే అది మాట్లాడే స్వేచ్ఛ లేదు.
ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో భారీ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి 'డ్రాగన్' అనే పేరు పరీశీలనలో ఉంది.… Read More
తెలుగు సినిమా కొంతకాలంగా విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. కొత్త సినిమాలకు కలెక్షన్లు ఉండడం లేదు. ఎంత ప్రచారం చేసినా కొన్ని… Read More
దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా పరిశ్రమకు వచ్చి 25 ఏళ్ళు. మొదటి చిత్రం "డాలర్ డ్రీమ్స్" 2000వ సంవత్సరంలో విడుదలైంది.… Read More
బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా ప్రస్తుతం "రానా నాయుడు 2" (Rana Naidu 2)ను ప్రమోట్ చేస్తోంది. వెంకటేష్, రానా… Read More
మలైక అరోరా వయసు 51 ఏళ్ళు. కానీ ఆమె ఫిజిక్ చూస్తే 30 ఏళ్ల యువతిలా ఉంటుంది. సాధారణంగా సినిమా… Read More
రాశి ఖన్నా ఆధ్యాత్మిక జీవన విధానం అలవర్చుకుంటోంది. ఆమె ఇప్పుడు ఓషో పుస్తకాలు చదువుతోంది. ఓషో ఒకప్పుడు భారతదేశంలో పేరొందిన… Read More