హీరోయిన్ జాన్వీ కపూర్ నాని సరసన నటించనుంది అని ఇటీవల బాగా ప్రచారం జరిగింది. నాని కొత్త సినిమాలో ఆమె హీరోయిన్ గా కన్ఫర్మ్ అయిపోయినట్లుగా మీడియాలో న్యూస్ శిఖర్ చేసింది. అంతే కాదు, ఈ సినిమాకోసం ఆమె ఏకంగా ఆరు కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేసింది అని వార్తలు వచ్చాయి.
ఇదే విషయాన్ని హీరో నానిని అడిగితే జాన్వీ కపూర్ తన సరసన నటించనుంది అన్న విషయం తనకు తెలియదు అంటున్నాడు.
‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల – నాని కాంబినేషన్ లో రెండో చిత్రం ఇటీవల ఘనంగా ప్రారంభం అయింది. ఐతే ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఒక పెద్ద స్టార్ ని తీసుకుంటే పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ వస్తుంది అని నిర్మాతల ఆలోచన. దానికి తగ్గట్లే జాన్వీ కపూర్ ని తీసుకుందామని అనుకున్నారట.
“బహుశా ఆమె పేరు వారి దర్శకుడు, నిర్మాతల మాటల్లో వచ్చి ఉంటుంది. నాకు తెలిసినంతవరకు ఆమెని కలిసి కథ చెప్పి ఉండరు. సో, ఆమె ఈ సినిమాలో నటిస్తోంది అన్న మాట నిజం కాదు. ఇప్పటివరకు ఐతే ఏ హీరోయిన్ ని తీసుకోలేదు,” అని నాని క్లారిటీ ఇచ్చాడు.
మరోవైపు జాన్వీ కపూర్ నటించిన మొదటి తెలుగు చిత్రం “దేవర” సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఆమె రెండో చిత్రం రామ్ సరసన. రామ్ చరణ్ మూవీ షూటింగ్ ఈ ఏడాది చివరలో మొదలు అవుతుంది. మరి జాన్వీ నాని సినిమాలో నటిస్తుందా లేదా అన్నది చూడాలి.
రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More