పాన్ ఇండియా సినిమా తీయాలని, ఆ రేంజ్ కు వెళ్లాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇటు హీరోలకు, అటు దర్శకులకు కూడా ఇలాంటి డ్రీమ్స్ ఉంటాయి. అనీల్ రావిపూడి మాత్రం ఆ మాట చెప్పడం లేదు. తను ఇక్కడే ఉంటానంటున్నాడు. తనకు నచ్చిన కథలే చేస్తానంటున్నాడు.
“నేనెప్పుడు నేల విడిచి సాము చేయను. రాజమౌళి, సుకుమార్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లిపోయారు. నేను కూడా అలా వెళ్లిపోవాలనుకోను. మరీ ముఖ్యంగా నన్ను నేను అక్కడ ఊహించుకోలేను. నేను ఎక్కడ బలంగా ఉన్నానో అక్కడే ఉంటాను. అలాంటి కథలే ఎంచుకుంటాను. రీజనల్ గా నేను చేస్తున్న సినిమాలతో హ్యాపీగా ఉన్నాను.”
తను పాన్ ఇండియా సినిమాలు చేయలేనంటున్నాడు రావిపూడి. అయితే తను చేసే సినిమాలు మాత్రం పాన్ ఇండియా స్థాయికి వెళ్లలాని గట్టిగా కోరుకుంటున్నట్టు తెలిపాడు.
ప్రస్తుతం ఈ దర్శకుడు, చిరంజీవితో చేయాల్సిన సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. తను ముందుగా కథలు రాసుకోనని, హీరోను దృష్టిలో పెట్టుకొని తన దగ్గరున్న లైన్స్ కు మార్పుచేర్పులు చేస్తుంటానని అన్నాడు.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More