కన్నడ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్, అతడి టీమ్ కు వ్యతిరేకంగా పోలీసులు 200 సాక్ష్యాధారాలు సేకరించారు. వీటన్నింటినీ పొందుపరుస్తూ 3991 పేజీల ఛార్జ షీట్ ను దాఖలు చేశారు. 8 వాల్యూమ్స్ తో ఉన్న ఈ ఛార్జ్ షీట్ ను బెంగళూరులోని 24వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు సమర్పించారు.
ఈ ఛార్జ్ షీట్ లో దర్శన్-పవిత్రకు వ్యతిరేకంగా అత్యంత బలమైన సాక్ష్యాధారాల్ని పోలీసులు సమర్పించినట్టు తెలుస్తోంది. వీటిలో ముఖ్యమైనది దర్శన్-పవిత్ర దుస్తులపై ఉన్న మృతుడు రేణుకాస్వామి రక్తపు మరకలు.
వీటికి క్రైమ్ సీన్ లో తీసిన ఫొటోను జతచేశారు. క్రైమ్ సీన్ లో రేణుకా స్వామి బతిమలాడుతున్న ఫొటోను పోలీసులు సంపాదించారు. వీటితో పాటు పలు డీఎన్ఏ ఆధారాలు, 8 మంది ప్రభుత్వ అధికారులు ఇచ్చిన రిపోర్టులు, ముగ్గురు ప్రత్యక్ష సాక్ష్యుల వాంగ్మూలాల్ని జతచేశారు. దీంతో దర్శన్-పవిత్ర ఈ కేసులో పూర్తిగా కూరుకుపోయినట్టయింది.
దర్శన్ గర్ల్ ఫ్రెండ్ పవిత్రకు రేణుకాస్వామి అభ్యంతరకర సందేశాలు పంపించాడు. దీంతో దర్శన్ కు కోపమొచ్చి రేణుకా స్వామి అంతుచూడాల్సిందిగా కొందర్ని పురమాయించాడు. వాళ్లంతా రేణుకాస్వామిని చిత్రహింసలు పెట్టి చంపారని, ఆ టైమ్ లో దర్శన్-పవిత్ర కూడా అక్కడే ఉన్నారని పోలీసులు వాదిస్తున్నారు.
హీరోయిన్ శృతిహాసన్, సోషల్ మీడియాకు శెలవు పెట్టింది. కొన్నాళ్ల పాటు తను సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నానని, నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తానని… Read More
మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ కు బెయిల్ దొరికింది. ఈ నటుడికి షరతులతో కూడిన… Read More
కియరా ప్రస్తుతం గర్భవతి అనే విషయం తెలిసిందే. దీంతో ఆమె కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరీ… Read More
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ … ఒక టైంలో తెలుగు సినిమాకి నాలుగు స్తంభాలుగా… Read More
అనుపమ పరమేశ్వరన్ నటించిన ఒక మలయాళ చిత్రం "జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ" ఇంతవరకు విడుదల కావడం లేదు.… Read More
6 నెలలు గడిచిపోయాయి. వెనక్కు తిరిగి చూస్తే ఇప్పటికీ 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా మాత్రమే కనిపిస్తోంది. ఈ మూవీ… Read More