కన్నడ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్, అతడి టీమ్ కు వ్యతిరేకంగా పోలీసులు 200 సాక్ష్యాధారాలు సేకరించారు. వీటన్నింటినీ పొందుపరుస్తూ 3991 పేజీల ఛార్జ షీట్ ను దాఖలు చేశారు. 8 వాల్యూమ్స్ తో ఉన్న ఈ ఛార్జ్ షీట్ ను బెంగళూరులోని 24వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు సమర్పించారు.
ఈ ఛార్జ్ షీట్ లో దర్శన్-పవిత్రకు వ్యతిరేకంగా అత్యంత బలమైన సాక్ష్యాధారాల్ని పోలీసులు సమర్పించినట్టు తెలుస్తోంది. వీటిలో ముఖ్యమైనది దర్శన్-పవిత్ర దుస్తులపై ఉన్న మృతుడు రేణుకాస్వామి రక్తపు మరకలు.
వీటికి క్రైమ్ సీన్ లో తీసిన ఫొటోను జతచేశారు. క్రైమ్ సీన్ లో రేణుకా స్వామి బతిమలాడుతున్న ఫొటోను పోలీసులు సంపాదించారు. వీటితో పాటు పలు డీఎన్ఏ ఆధారాలు, 8 మంది ప్రభుత్వ అధికారులు ఇచ్చిన రిపోర్టులు, ముగ్గురు ప్రత్యక్ష సాక్ష్యుల వాంగ్మూలాల్ని జతచేశారు. దీంతో దర్శన్-పవిత్ర ఈ కేసులో పూర్తిగా కూరుకుపోయినట్టయింది.
దర్శన్ గర్ల్ ఫ్రెండ్ పవిత్రకు రేణుకాస్వామి అభ్యంతరకర సందేశాలు పంపించాడు. దీంతో దర్శన్ కు కోపమొచ్చి రేణుకా స్వామి అంతుచూడాల్సిందిగా కొందర్ని పురమాయించాడు. వాళ్లంతా రేణుకాస్వామిని చిత్రహింసలు పెట్టి చంపారని, ఆ టైమ్ లో దర్శన్-పవిత్ర కూడా అక్కడే ఉన్నారని పోలీసులు వాదిస్తున్నారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More