విజయ్ దేవరకొండ, రష్మిక మళ్లీ కలిసి వెండితెరపై కనిపించనున్నారు. ‘గీతగోవిందం’ చిత్రంతో విజయ్ దేవరకొండ, రష్మిక జంట బ్లాక్ బస్టర్ జోడీగా నిలిచింది. ఈ జంటకు ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఏర్పడింది.
దీని తర్వాత వారు ‘డియర్ కామ్రేడ్’ కోసం మళ్లీ కలిశారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయింది. కానీ ఈ జంట క్రేజ్ మాత్రం తగ్గలేదు. తాజా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ, రష్మిక మళ్లీ కలిసి నటించబోతున్నారు. వీళ్ల కాంబోలో ముచ్చటగా మూడో సినిమా రాబోతోంది.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘జెర్సీ’ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఆ తర్వాత రాహుల్ సంకృత్యాన్ తో సినిమా చేయబోతున్నాడు. ‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగరాయ్’తో పాపులరైన రాహుల్, ఈసారి విజయ్ ను మరో కొత్త పాత్రలో చూపించబోతున్నాడు. ఈ ప్రాజెక్టులో హీరోయిన్ గా రష్మికను తీసుకున్నట్టు తెలుస్తోంది.
నిజానికి కాంబినేషన్ కోసం కాకుండా, కథ బాగుంటేనే తామిద్దరం కలిసి నటిస్తామని గతంలోనే విజయ్ దేవరకొండ ప్రకటించాడు. కాబట్టి రాహుల్ సినిమాలో రష్మికకు పవర్ ఫుల్ రోల్ దక్కినట్టే ఉంది.
తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More
చిరంజీవి, రామ్ చరణ్ పై ఓ నాలుగేళ్ల కిందట దర్శకుడు విజయ్ కనకమేడల వేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయిన… Read More
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న థియేట్రికల్ సిస్టమ్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్సుల టైపులో పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు… Read More
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More