పూరి జగన్నాధ్ ఇటీవలే కొత్త సినిమా ప్రకటించాడు. తెలుగులో ఏ హీరో డేట్స్ ఇవ్వకపోవడంతో ఈ సారి తమిళ్ హీరో విజయ్ సేతుపతిని ఒప్పించాడు. ఒక హీరోయిన్ గా టబును తీసుకున్నాడు. ఐతే, ఆమె హీరోయిన్ గా నటిస్తుందా లేక తల్లి పాత్ర పోషిస్తుందా లేక విలన్ గానా అన్నది క్లారిటీ లేదు.
టబుని ఒప్పించడంలో పూరి సక్సెస్ కావడం వెనుక భారీ పారితోషికం అనే మాట కూడా వినిపిస్తోంది.
టబు ఇటీవల అమెరికన్ వెబ్ సిరీస్ లో నటించింది. హాలీవుడ్ చిత్రాలు కూడా చేసింది. అలాగే ఆమె ఇటీవల నటించిన హిందీ చిత్రాలను నెట్ ఫ్లిక్స్, అమెజాన్ వంటి ఓటిటి సంస్థలు భారీ మొత్తానికి కొనుగోలు చేశాయి. దాంతో టబు ఒక సినిమాలో ఉంటే ఓటిటి డీల్ త్వరగా పూర్తి అవుతుంది అని బాలీవుడ్ నిర్మాతలు భావిస్తున్నారు.
ఈ లెక్కలు వేసుకొనే నిర్మాత ఛార్మి టబుని తీసుకొని ఉంటుంది అని అంటున్నారు. ఐతే, టబు కూడా తన లెక్కలు తాను వేసుకొని… పూరి సినిమాకి రెగ్యులర్ గా తీసుకొనే దానికన్నా ఎక్కువ డిమాండ్ చేసిందట.
టబు అడిగినంత ఇచ్చేందుకు పూరి ఒప్పుకున్నారు. ఎందుకంటే విజయ్ సేతుపతి, టబు అన్న కాంబినేషన్ వల్లే ఈ సినిమాకి అటెన్షన్ దక్కింది. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది.
హీరోయిన్ శృతిహాసన్, సోషల్ మీడియాకు శెలవు పెట్టింది. కొన్నాళ్ల పాటు తను సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నానని, నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తానని… Read More
మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ కు బెయిల్ దొరికింది. ఈ నటుడికి షరతులతో కూడిన… Read More
కియరా ప్రస్తుతం గర్భవతి అనే విషయం తెలిసిందే. దీంతో ఆమె కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరీ… Read More
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ … ఒక టైంలో తెలుగు సినిమాకి నాలుగు స్తంభాలుగా… Read More
అనుపమ పరమేశ్వరన్ నటించిన ఒక మలయాళ చిత్రం "జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ" ఇంతవరకు విడుదల కావడం లేదు.… Read More
6 నెలలు గడిచిపోయాయి. వెనక్కు తిరిగి చూస్తే ఇప్పటికీ 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా మాత్రమే కనిపిస్తోంది. ఈ మూవీ… Read More