ప్రస్తుతం మనదేశంలో అధికార బీజేపీ భావజాలానికి అనుగుణంగా సినిమాల రూపకల్పన జోరుగా సాగుతోంది. తెలుగు సినిమా రంగం ఈ ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది. బాలీవుడ్ దానికి మరింత ఊపుతీసుకొచ్చింది. ఇప్పుడు అన్ని సినిమా పరిశ్రమల్లో “రైట్ వింగ్” ఐడియాలజీ (బీజేపీ అనుకూల) ప్రకారం అనేక సినిమాలు రూపొందుతున్నాయి. ఇవి విజయాలు కూడా పొందుతున్నాయి. దాంతో, హీరోలు, దర్శక, నిర్మాతలు వీటిపైనే ఫోకస్ పెట్టారు.
ఇక కన్నడ హీరో రిషబ్ శెట్టి పాన్ ఇండియా హీరోగా ఎదగడంలో ఇదే సరయిన పద్దతి అని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే “కాంతార” సినిమాతో దేశమంతా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. దాంతో, ఈ తరహా సినిమాలకు ఫెవరేట్ నటుడిగా మారిపోయారు.
తాజాగా అతను “కాంతార” ప్రీక్వెల్ లో నటిస్తున్నారు. అది వచ్చే ఏడాది విడుదల అవుతుంది. ఇక ఆ తర్వాత “హనుమాన్”కి సీక్వెల్ గా రూపొందే “జై హనుమాన్”లో నటిస్తారు. అది 2026లో రిలీజ్ కానుంది. ఇక 2027లో విడుదల అయ్యే కొత్త సినిమాని ప్రకటించారు. అదే ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తీసే సినిమా… The Pride of Bharat: Chhatrapati Shivaji Maharaj. ఆ మూవీని ఈ రోజు ప్రకటించారు.
ఇలా వరుసగా రెండు భక్తి చిత్రాలు, ఒక శివాజీ మహారాజ్ బయోపిక్ లైన్లో పెట్టి తన ఉద్దేశాలు, లక్ష్యాలు స్పష్టంగా పేర్కొన్నారు రిషబ్ శెట్టి.
తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More
చిరంజీవి, రామ్ చరణ్ పై ఓ నాలుగేళ్ల కిందట దర్శకుడు విజయ్ కనకమేడల వేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయిన… Read More
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న థియేట్రికల్ సిస్టమ్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్సుల టైపులో పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు… Read More
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More