ఎదుటి వ్యక్తిని గౌరవించడంలో పరిశ్రమలో చిరంజీవి తర్వాతే ఎవరైనా. చిన్న నటుడిపైనా, జర్నలిస్ట్ అయినా, మరో రంగానికి చెందిన వ్యక్తి అయినా అందరికీ సమప్రాధాన్యం ఇస్తారు చిరంజీవి. వాళ్లకు తగిన గౌరవం ఇస్తారు. అదే ఆయన్ను అందరివాడిని చేసింది.
నటి మధుబాల స్టేట్ మెంట్ తో ఈ విషయం మరోసారి తెరపైకొచ్చింది. చిరంజీవి తనకు అపారమైన గౌరవం ఇవ్వడం చూసి తను ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చింది.
కెరీర్ ప్రారంభించిన కొత్తలో ఓసారి చిరంజీవిని కలిసిందంట మధుబాల. అప్పటికే ఆయన మెగాస్టార్. అయినప్పటికీ తనను చూసి కుర్చీలోంచి లేచి విష్ చేశారని, అప్పుడు తను ఆశ్చర్యపోయానని అన్నారు.
లాంగ్ బ్యాక్ తర్వాత రీసెంట్ గా మరోసారి చిరంజీవిని కలిసి అవకాశం దక్కిందని, ఈసారి కూడా ఆయన అదే విధంగా కుర్చీలోంచి లేచి తనకు రెస్పెక్ట్ ఇచ్చారని, తను కూర్చున్న తర్వాతే ఆయన కూర్చున్నారని మధుబాల గుర్తుచేసుకుంది.
అప్పటికీ ఇప్పటికీ చిరంజీవి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని గుర్తుచేసుకుంది మధుబాల. చిరంజీవి అంటేనే గౌరవానికి ఓ ప్రతీక అని అంటోంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More