“ఇన్నాళ్లూ రాజ్ తరుణ్ ను ఇబ్బంది పెట్టాను. ఇకపై అతడ్ని ఇబ్బంది పెట్టను, అన్ని కేసులు ఉపసంహరించుకుంటాను. కనిపిస్తే కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెబుతాను” కొన్ని రోజుల కిందట లావణ్య ఇచ్చిన స్టేట్ మెంట్ ఇంది.
“ఇప్పుడు నేను ఉంటున్న విల్లా రాజ్ తరుణ్ దే. నాకు ఆ విల్లా అక్కర్లేదు. రాజ్ తరుణ్ ముందుకొచ్చి నాతో మాట్లాడాలి. చర్చలు జరపాలి. నేను బయటకు వెళ్లిపోతాను.” ఈరోజు లావణ్య ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది.
“రాజ్ తరుణ్ రౌడీల్ని పెట్టించి నాపై దాడి చేయిస్తున్నాడు. నన్ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అతడ్ని కోర్టు మెట్లు ఎక్కిస్తాను. ఫిలిం ఛాంబర్ ముందు ధర్నా చేస్తాను.” కొద్దిసేపటికి కిందట లావణ్య చేసిన ప్రకటన ఇది.
అసలు లావణ్య ఏం కోరుకుంటోంది.. ఆమెకు ఏం కావాలి.. రాజ్ తరుణ్ సంతోషంగా ఉంటే చాలు, అతడి జీవితం నుంచి వెళ్లిపోతానంటోంది.. మరోవైపు కోర్టుకు లాగుతానంటోంది, కేసులు పెడుతోంది.
ప్రస్తుతం తను ఉంటున్న విల్లా రాజ్ తరుణ్ దే అంటోంది, కానీ తనకు అక్కర్లేదంటోంది. అతడు ముందుకొచ్చి మాట్లాడితే విల్లా విడిచి వెళ్లిపోతానంటోంది.
ఇకపై రాజ్ తరుణ్ గురించి పబ్లిక్ గా మాట్లాడను. “చిన్నోడా నిన్ను ఇబ్బందిపెట్టను” అంటూ మాట్లాడిన లావణ్య, ఇప్పుడు అతడి కోసం ఫిలిం ఛాంబర్ ముందు ధర్నా చేస్తానంటోంది.
రాజ్ తరుణ్ వద్దు, విల్లా వద్దు అన్నప్పుడు ఎందుకిదంతా..? ఆమె స్వచ్ఛందంగా బయటకెళ్లిపోవచ్చు కదా? ఆమె మీడియా ఎటెన్షన్ కోరుకుంటోందా? సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది.
తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరో ఆసక్తికర అంశాన్ని బయటపెట్టింది హీరోయిన్ సమంత. తనకు ఫోన్ అడిక్షన్ ఉండేదని, సెల్… Read More
హీరోయిన్ శృతిహాసన్, సోషల్ మీడియాకు శెలవు పెట్టింది. కొన్నాళ్ల పాటు తను సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నానని, నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తానని… Read More
మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ కు బెయిల్ దొరికింది. ఈ నటుడికి షరతులతో కూడిన… Read More
కియరా ప్రస్తుతం గర్భవతి అనే విషయం తెలిసిందే. దీంతో ఆమె కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరీ… Read More
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ … ఒక టైంలో తెలుగు సినిమాకి నాలుగు స్తంభాలుగా… Read More
అనుపమ పరమేశ్వరన్ నటించిన ఒక మలయాళ చిత్రం "జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ" ఇంతవరకు విడుదల కావడం లేదు.… Read More