వరుస సంగీత విభావరులతో ఊపుమీదున్న దేవిశ్రీ ప్రసాద్ కు విశాఖ పోలీసులు బ్రేకులేశారు. మరో 2 రోజుల్లో వైజాగ్ లో జరగనున్న మ్యూజికల్ నైట్ కు అనుమతి నిరాకరించారు. ఒకసారి, రెండు సార్లు కాదు, ఏకంగా 4 సార్లు అనుమతి నిరాకరించడంతో కన్సర్ట్ జరగడం కష్టమనే టాక్ నడుస్తోంది.
ఇలాంటి టైమ్ లో ఉన్నఫలంగా వైజాగ్ లో ల్యాండ్ అయ్యాడు దేవిశ్రీ. అతడు తన షో కోసమే వైజాగ్ చేరుకున్నాడు. ఓవైపు అనుమతి దొరక్కుండా, దేవిశ్రీ వైజాగ్ లో ల్యాండ్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.
పోర్ట్ స్టేడియంలో ఈవెంట్ పెట్టుకున్నారు. దాని కెపాసిటీ 3వేలు మాత్రమే, నిర్వహకులు మాత్రం 10వేల టికెట్లు అమ్ముకున్నారు. దీంతో పర్మిషన్ రాలేదు. ఈ నేపథ్యంలో, వేదిక మారుస్తారా లేక పోలీసులతో మరోసారి చర్చిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.
కొన్ని రోజుల కిందట విశాఖలోనే ఓ స్పోర్ట్స్ స్విమ్మింగ్ సెంటర్ లో బాలుడు మృతి చెందాడు. అప్పట్నుంచి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరులో ఎదురుకాని సమస్య, దేవిశ్రీకి విశాఖలో ఎదురైంది.
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More
పవన్ కల్యాణ్ లో నటుడు మాత్రమే కాదు.. ఓ దర్శకుడు, సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్, స్టంట్ మాస్టర్, లిరిసిస్ట్ కూడా… Read More
అప్పట్లో తెల్లచీరకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది శ్రీదేవి. ఆమె తెల్లచీర కడితే ప్రేక్షక లోకం ఊగిపోయేది. ఆ తర్వాత… Read More
త్రివిక్రమ్-చరణ్ కాంబినేషన్ పై ఇటీవల వార్తలొచ్చాయి. తెలుగుసినిమా.కామ్ ఎక్స్ క్లూజివ్ గా రాసింది కూడా. బన్నీతో సినిమా ఇప్పట్లో లేకపోవడంతో…… Read More
నటుడు రఘుబాబు పాటలు కూడా పాడాడట. కాకపోతే ఎవరి సంగీత దర్శకత్వంలో పాటలు పాడారో ఆయనకే తెలియదు. లేదా మర్చిపోయారు.… Read More
"వార్ 2" టీజర్లో కియారా అద్వానీ బికినీ షాట్ చూసి కుర్రాళ్లు మతి పోగొట్టుకున్నారు. సాధారణ ప్రేక్షకులు, యువకులు ఆమె… Read More