బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారింది. కొత్తగా పెళ్లయిన తన సోదరుడికి ఆమె అదిరిపోయే బహుమతి ఇచ్చింది. తన కజిన్ కు చండీగడ్ లో ఖరీదైన లగ్జరీ ఇంటిని కొని ఇచ్చింది కంగన.
తన సోదరుడికి ఇల్లు గిఫ్ట్ గా ఇచ్చిన విషయాన్ని కంగనా రనౌత్, సోషల్ మీడియాలో వెల్లడించింది.
“గురునానక్ దేవ్ జీ మన దగ్గర ఉన్న చిన్నదైనా పంచుకోవాలని చెప్పారు. మనకు ఏమీ లేదని నిత్యం బాధపడుతుంటాం. కానీ మనం పంచుకోవాలనుకుంటే… ఎంత చిన్నదైనా అదే పెద్ద ఆనందమని నేను భావిస్తాను,” అంటూ సోదరుడిపై పోస్ట్ పెట్టింది కంగనా.
తను పెద్ద బహుమతి ఇచ్చినప్పటికీ, దాన్ని చిన్నదిగానే చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్ కమ్ పొలిటీషియన్.
ఇటీవల హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో ఎంపీగా గెలుపొందింది కంగనా రనౌత్. త్వరలోనే ఆమె “ఎమర్జన్సీ” అనే సినిమాను విడుదల చేయబోతోంది. ఇందులో ఆమె భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. ఈ చిత్రానికి డైరక్టర్ కూడా కంగనానే.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More