ఇటీవల ఎన్నికల్లో జనసేన పోటీచేసిన అన్ని స్థానాల్లో గెలిచింది. ముఖ్యంగా గోదావరి జిల్లాలలో తిరుగులేని శక్తి అని ప్రూవ్ చేసుకొంది. సోషల్ మీడియాలో జనసైనికులు ఇప్పటికీ తెగ హంగామా చేస్తుంటారు. అలాంటి జనసేన శక్తి తమ సొంత నాయకుడి కొడుకు సినిమాకి కనీసం ఓపెనింగ్స్ కూడా ఇవ్వలేకపోయారు.
నాగబాబు జనసేనలో “కీలక” నేత. ఆయన కొడుకు నటించిన “మట్కా” సినిమా గత వీకెండ్ విడుదలైంది. వరుణ్ తేజ్ కూడా పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేశారు. కానీ పాపం వరుణ్ తేజ్ సినిమా విడుదలైతే కనీసం ఓపెనింగ్ కూడా ఇవ్వలేదు జనసైనికులు. గోదావరి జిల్లాలో కూడా సినిమాని పట్టించుకోలేదు.
వరుణ్ తేజ్ “మట్కా” సినిమా ఫంక్షన్లో అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ కామెంట్ కూడా చేశాడు. దాన్ని జనసేన ఫాలోవర్స్ తెగ ట్రెండ్ చేశారు సోషల్ మీడియాలో. కానీ సినిమా చూసేందుకు మాత్రం పోలేదు.
వరుణ్ తేజ్ కెరీర్లోనే అత్యల్ప కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది “మట్కా”. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత వరుణ్ తేజ్ నుంచి విడుదలైన మొదటి చిత్రం ఇదే. అభిమానుల వల్ల సినిమాలు అడవు అని మరోసారి ప్రూవ్ అయింది. సినిమాలో విషయం ఉంటేనే జనం చూసేందుకు వస్తారు. సాధారణ జనం వల్లే సినిమాలు ఆడుతాయి తప్ప సోషల్ మీడియాలో హడావిడి చేసే ఫ్యాన్స్ వల్ల ఉపయోగం ఉండదు.
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More
పవన్ కల్యాణ్ లో నటుడు మాత్రమే కాదు.. ఓ దర్శకుడు, సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్, స్టంట్ మాస్టర్, లిరిసిస్ట్ కూడా… Read More
అప్పట్లో తెల్లచీరకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది శ్రీదేవి. ఆమె తెల్లచీర కడితే ప్రేక్షక లోకం ఊగిపోయేది. ఆ తర్వాత… Read More
త్రివిక్రమ్-చరణ్ కాంబినేషన్ పై ఇటీవల వార్తలొచ్చాయి. తెలుగుసినిమా.కామ్ ఎక్స్ క్లూజివ్ గా రాసింది కూడా. బన్నీతో సినిమా ఇప్పట్లో లేకపోవడంతో…… Read More