ఇటీవల ఎన్నికల్లో జనసేన పోటీచేసిన అన్ని స్థానాల్లో గెలిచింది. ముఖ్యంగా గోదావరి జిల్లాలలో తిరుగులేని శక్తి అని ప్రూవ్ చేసుకొంది. సోషల్ మీడియాలో జనసైనికులు ఇప్పటికీ తెగ హంగామా చేస్తుంటారు. అలాంటి జనసేన శక్తి తమ సొంత నాయకుడి కొడుకు సినిమాకి కనీసం ఓపెనింగ్స్ కూడా ఇవ్వలేకపోయారు.
నాగబాబు జనసేనలో “కీలక” నేత. ఆయన కొడుకు నటించిన “మట్కా” సినిమా గత వీకెండ్ విడుదలైంది. వరుణ్ తేజ్ కూడా పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేశారు. కానీ పాపం వరుణ్ తేజ్ సినిమా విడుదలైతే కనీసం ఓపెనింగ్ కూడా ఇవ్వలేదు జనసైనికులు. గోదావరి జిల్లాలో కూడా సినిమాని పట్టించుకోలేదు.
వరుణ్ తేజ్ “మట్కా” సినిమా ఫంక్షన్లో అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ కామెంట్ కూడా చేశాడు. దాన్ని జనసేన ఫాలోవర్స్ తెగ ట్రెండ్ చేశారు సోషల్ మీడియాలో. కానీ సినిమా చూసేందుకు మాత్రం పోలేదు.
వరుణ్ తేజ్ కెరీర్లోనే అత్యల్ప కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది “మట్కా”. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత వరుణ్ తేజ్ నుంచి విడుదలైన మొదటి చిత్రం ఇదే. అభిమానుల వల్ల సినిమాలు అడవు అని మరోసారి ప్రూవ్ అయింది. సినిమాలో విషయం ఉంటేనే జనం చూసేందుకు వస్తారు. సాధారణ జనం వల్లే సినిమాలు ఆడుతాయి తప్ప సోషల్ మీడియాలో హడావిడి చేసే ఫ్యాన్స్ వల్ల ఉపయోగం ఉండదు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More