ఇదో క్రేజీ రూమర్. ఆల్రెడీ అక్క జాన్వి కపూర్ టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇప్పుడు చెల్లెలు ఖుషీ కపూర్ కూడా టాలీవుడ్ పై కన్నేసిందంట. జాన్విలానే ఖుషి కూడా నందమూరి కాంపౌండ్ పైనే గురిపెట్టిందనేది తాజా సమాచారం.
బాలకృష్ణ తన నటవారసుడిగా మోక్షజ్ఞను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయబోతున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్నాడు మోక్షు. ఇందులో హీరోయిన్ గా ఖుషి కపూర్ ను తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారట మేకర్స్. వినడానికి కాస్త క్రేజీగా ఉన్నప్పటికీ ఇదేమంత అసాధ్యం కాదు.
ఎందుకంటే, ఖుషీ కపూర్ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉంది. ఓటీటీలో అడుగుపెడుతూనే, బాలీవుడ్ లోకి కూడా వచ్చేసింది. కాబట్టి ఈమెను టాలీవుడ్ కు తీసుకురావడం పెద్ద సమస్య కాదు. పైగా అక్క కూడా ఇక్కడే ఉంది కాబట్టి, చెల్లెలకు పని ఈజీ అయిపోతుంది.
ఈ సందర్భంగా బోనీ కపూర్ గతంలో చేసిన కామెంట్స్ ను ఓసారి గుర్తుచేసుకుందాం. చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ లో మాట్లాడిన బోనీ కపూర్, తన చిన్నకూతురు ఖుషీకి కూడా సౌత్ సినిమాలంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. చూస్తుంటే, పుకార్లు నిజమయ్యేలా ఉన్నాయి. జాన్వి-ఖుషి కలిసి టాలీవుడ్ ను ఏలేలా ఉన్నారు.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More