సీనియర్ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి సత్కరించింది. 50 ఏళ్ల నటన కెరీర్ కి దక్కిన గౌరవం అది. ఐతే, తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా బాలయ్య పద్మ అవార్డు విషయంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
బసవతారకం ఆసుపత్రిలో జరిగిన తన పుట్టిన రోజు వేడుకల్లో బాలయ్య మాట్లాడారు. అవార్డులకు నేను అలంకారం కానీ అవి నాకు కావు అంటూ బాలయ్య వ్యాఖ్యానించడంతో ఆ వీడియో వైరల్ అయింది.
“నేను ఒకటే అంటాను. బిరుదలకు, ఇటువంటి వాటికి నేను అలంకారం ఏమో కానీ అవి నాకు ఎప్పుడు అలంకారం కాదంటాను. ఈ బిరుదు నాకు నటనకు ఇచ్చారు. కానీ నేను మాత్రం నా సంఘసేవకు ఇచ్చారని భావిస్తాను. సో, ఇందులో మీ (ఆసుపత్రి సిబ్బంది) భాగస్వామ్యం ఉంది,” అని బాలయ్య అన్నారు.
గతంలో ఎన్టీఆర్ కి భారతరత్న అవార్డు కాలిగోటితో సమానం అని వ్యాఖ్యానించి వివాదం రేపారు బాలయ్య.
కేంద్ర ప్రభుత్వ అవార్డులను బాలయ్య తక్కువ చేసి మాట్లాడుతుంటారు, మళ్ళీ వాటికోసం మొత్తం నందమూరి అభిమానులు, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు వాటినే డిమాండ్ చేస్తుంటారు, వాటికోసం అన్ని ప్రయత్నాలు చేస్తారు అంటూ సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తోంది.
దీపిక పదుకోన్ ఇటీవల 25 నుంచి 30 కోట్ల పారితోషికం అడగడం, అలాగే ఆరు గంటలే పని చేస్తానని చెప్పడంతో… Read More
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా సెట్ అయింది. అల్లు అర్జున్ చెయ్యాల్సిన సినిమా ఎన్టీఆర్ కి వచ్చింది.… Read More
ప్రియాంక చోప్రాకి చాలా క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా భారీ పాన్ ఇండియన్, పాన్ వరల్డ్ చిత్రాలకు ఆమె మొదటి ఛాయిస్… Read More
అల్లు అర్జున్ తనకి మూడు హిట్స్ ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ కి హ్యాండిచ్చారు. దాంతో, త్రివిక్రమ్ వరుసగా రెండు సినిమాలు… Read More
హీరోయిన్ నేహా శెట్టికి గ్లామర్ ఇమేజ్ ఉంది. కానీ ఆమెకి అవకాశాలు మాత్రం తక్కువే. ఆమె పెద్దగా బిజీగా లేదు.… Read More
చాలామంది సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో ఒకటి అధికారిక ఐడి, ఇంకోటి దొంగ ఐడి వాడుతారు. అధికారిక ఐడి నుంచి మిగతావారిని… Read More