ఊహించని విధంగా అఖిల్ ఎంగేజ్ మెంట్ మేటర్ తెరపైకొచ్చిన సంగతి తెలిసిందే. ఓవైపు అంతా నాగచైతన్య పెళ్లి కబుర్లతో బిజీగా ఉంటున్న టైమ్ లో, ఉరుములేని పిడుగులా నిశ్చితార్థం మేటర్ బయటపెట్టాడు అఖిల్. జైనాబ్ రౌజీని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు.
అయితే అదే టైమ్ లో అతడి పెళ్లిపై సోషల్ మీడియాలో పుకార్లు చెలరేగాయి. నాగచైతన్య పెళ్లితో పాటు, అఖిల్ పెళ్లిని కూడా ఒకే రోజు, ఒకే ముహూర్తానికి జరిపించాలని నాగార్జున ఫిక్స్ అయ్యాడట. అందుకే చిన్నకొడుకు నిశ్చితార్థాన్ని కూడా చకచకా పూర్తిచేశాడట.
వైరల్ అవుతున్న ఈ పుకారులో నిజం లేదని తాజాగా నాగ్ ప్రకటించాడు. ప్రస్తుతం తమ కుటుంబం దృష్టి మొత్తం నాగచైతన్య పెళ్లిపైనే ఉందని, వచ్చే ఏడాది అఖిల్ పెళ్లి జరిపిస్తామని నాగార్జున విస్పష్టంగా ప్రకటించాడు. దీంతో అఖిల్ పెళ్లిపై 24 గంటలుగా నడిచిన ఊహాగానాలకు తెరపడింది.
హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త కూతురు జైనాబ్ రౌజీ. ఆమె స్వతహాగా పెయింటర్. ఇప్పటికే తన పెయింటింగ్స్ తో హైదరాబాద్, ముంబయి, లండన్, దుబాయ్ లో ప్రదర్శనలు కూడా ఇచ్చింది.
తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరో ఆసక్తికర అంశాన్ని బయటపెట్టింది హీరోయిన్ సమంత. తనకు ఫోన్ అడిక్షన్ ఉండేదని, సెల్… Read More
హీరోయిన్ శృతిహాసన్, సోషల్ మీడియాకు శెలవు పెట్టింది. కొన్నాళ్ల పాటు తను సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నానని, నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తానని… Read More
మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ కు బెయిల్ దొరికింది. ఈ నటుడికి షరతులతో కూడిన… Read More
కియరా ప్రస్తుతం గర్భవతి అనే విషయం తెలిసిందే. దీంతో ఆమె కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరీ… Read More
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ … ఒక టైంలో తెలుగు సినిమాకి నాలుగు స్తంభాలుగా… Read More
అనుపమ పరమేశ్వరన్ నటించిన ఒక మలయాళ చిత్రం "జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ" ఇంతవరకు విడుదల కావడం లేదు.… Read More