మొన్నటివరకు కోలీవుడ్ లో సుడిగాలి పర్యటన చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు టాలీవుడ్ లో విస్తృతంగా పర్యటిస్తోంది. దీనికి కారణం ఆమె పెళ్లి. తన వివాహానికి అందర్నీ ఆహ్వానించేందుకు వరలక్ష్మి ఇలా కష్టపడుతోంది.
తమిళనాట కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి ప్రముఖులతో పాటు చాలామందికి శుభలేఖలు అందించిన వరలక్ష్మి.. ప్రస్తుతం హైదరాబాద్ లో పలువురు సెలబ్రిటీల్ని కలుస్తోంది. అడివి శేష్, ప్రశాంత్ వర్మ, సమంత, గోపీచంద్ మలినేని, రవితేజ, తమన్, మురళీ శర్మ.. ఇలా ఎంతోమందిని పర్సనల్ గా కలిగి శుభలేఖలు అందిస్తోంది. ప్రస్తుతం ఈ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వచ్చేనెల 2న డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు వరలక్ష్మి-నికొలాయ్. ఆ తర్వాత చెన్నైలో సినీ రాజకీయ ప్రముఖులకు గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. సెలబ్రిటీస్ అంతా రిసెప్షన్ కే వస్తారు.
39 ఏళ్ల వరలక్ష్మి, నికొలాయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంటోంది. నికొలాయ్ కు మాత్రం ఇది మొదటి పెళ్లి కాదు. అతడికి ఆల్రెడీ పెళ్లయి, భార్యకు విడాకులిచ్చాడు. ఇప్పుడు వరలక్ష్మిని పెళ్లాడుతున్నాడు.
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More