‘పుష్ప-2’ విషయంలో తమన్ కు ఎంత అన్యాయం జరిగిందో అందరికీ తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ ను కాదని తనకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించే బాధ్యత అప్పగించారని, ‘పుష్ప-2’ కు తనే బీజీఎం ఇచ్చానని విడుదలకు ముందు గొప్పగా చెప్పుకున్నాడు తమన్.
కట్ చేస్తే, సినిమా రిలీజైన తర్వాత తమన్ కు టైటిల్స్ క్రెడిట్ ఇవ్వలేదు. ఇంకా చెప్పాలంటే, తమన్ వర్క్ ను అస్సలు వాడుకోలేదు. సామ్ సీఎస్ కంపోజ్ చేసిన స్కోర్ తో పాటు, దేవిశ్రీ అందించిన స్కోర్ నే ఉపయోగించారు.
దీనిపై చాన్నాళ్ల పాటు మౌనం వహించిన తమన్, ఎట్టకేలకు స్పందించాడు.
‘పుష్ప-2’ కు 10 రోజుల పాటు కష్టపడి 3 వెర్షన్ల బీజీఎం అందించానని, కానీ మేకర్స్ అందులోంచి ఒకటి కూడా వాడుకోలేదని అన్నాడు. ఈ విషయంలో తను కొంత బాధపడ్డానని, అయితే అందరి అంగీకారంతోనే ఆ నిర్ణయం తీసుకున్నారని తెలిపాడు.
‘పుష్ప-2’ కోసం తన వర్క్ వాడడం లేదనే విషయాన్ని విడుదలకు ముందే తమన్ కు సమాచారం అందించారట. దానికి తమన్ అంగీకరించినట్టు తెలిపాడు. ఈ సినిమాలో తమన్ వర్క్ ను వాడుకోనప్పటికీ, అతడికి భారీగా రెమ్యూనరేషన్ ముట్టజెప్పారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More