క్యారెక్టర్ కొత్తగా లేకపోతే అస్సలు సినిమా చేయదు టబు. అవకాశాలు లేకపోతే ఇంట్లో రెస్ట్ తీసుకుంటాను తప్ప, రొటీన్ పాత్రలు మాత్రం చేయనని, ఆమె ఇటీవల క్లియర్ గా ప్రకటించింది. అందుకే ”అల వైకుంఠపురములో” సినిమా తర్వాత మళ్లీ ఆమె తెలుగులో కనిపించలేదు.
అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆ సినిమా వచ్చి దాదాపు ఐదేళ్లు దాటుతోంది. కానీ ఇప్పటివరకు మరో సినిమాలో కనిపించలేదు టబు. ఇన్నాళ్లకు మరో సినిమాకు ఓకే చెప్పింది ఈ సీనియర్ నటి.
డిఫరెంట్ స్టోరీ రాసుకొని విజయ్ సేతుపతిని ఒప్పించాడు పూరి జగన్నాధ్. దర్శకత్వం వహించడంతో పాటు, చార్మితో కలిసి ఆ సినిమాను నిర్మించబోతున్నాడు. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇప్పుడీ సినిమాలో ఫిమేల్ లీడ్ కోసం టబును అనుకుంటున్నారు.
కథ కొత్తగా లేకపోతే సినిమా చేయని టబు, ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పిందంటే, పూరి రాసుకున్న కథ ఈసారి కొత్తగా ఉందని ఫిక్స్ అయిపోవచ్చు.
53 ఏళ్ల టబు తన నటనతో హాలీవుడ్ మేకర్స్ ను సైతం మెప్పించింది. డూన్ సిరీస్ తో పాటు రీసెంట్ గా క్రూ అనే సినిమాతో అందర్నీ ఆకట్టుకుంది. మళ్లీ ఇన్నేళ్లకు సౌత్ లో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సినిమా చేయబోతోంది.
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More