ఒక హారర్ కామెడీ మూవీ ఇండియాలో మూడు వందల కోట్లు కలెక్ట్ చేస్తుందని మొన్నటివరకు ఎవరూ ఊహించలేదు. పెద్ద స్టార్ లేని మూవీ ఆ రేంజ్ లో వసూళ్లు చెయ్యడంతో అందరికి మైండ్ బ్లాంక్ అయింది.
“స్త్రీ 2” సినిమా ఇప్పుడు దర్జాగా 300 కోట్ల మార్క్ దాటేసింది. వడివడిగా 400 కోట్ల మార్క్ అందుకునేందుకు పరిగెడుతోంది. ఈ సినిమా కలెక్షన్ల ట్రెండ్ చూస్తుంటే “యానిమల్”, “గదర్ 2” సినిమాల సరళి కనిపిస్తోంది. వాటిలాగే ఈ సినిమా కూడా 500 కోట్ల వసూళ్లు అందుకుంటుందా అనేది చూడాలి.
“స్త్రీ” మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లలోపే కలెక్ట్ చేసింది. రెండో భాగం ఇండియాలోనే 300 కోట్ల మైలురాయి దాటేసింది.
రాజ్ కుమార్ రావు హీరోగా నటించిన “స్త్రీ 2″లో శ్రధ్ద కపూర్ మెయిన్ హీరోయిన్ రోల్. ఐతే, శ్రద్ధ సినిమాలో కన్పించేది తక్కువే. ఆమె నిడివి చాలా చిన్నదే అయినా శ్రద్ధ వల్లే భారీ ఓపెనింగ్స్ వచ్చాయి అనేది నిజం. ఇక సినిమా కథ, కథనాలు అంచనాలు అందుకోవడంతో ఈ రేంజ్ లో ఆడుతోంది.
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More