సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్, దాదాపు 5 నెలలుగా కిమ్స్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడా బాలుడ్ని డిశ్చార్జ్ చేశారు. అయితే అతడు నేరుగా ఇంటికెళ్లడం లేదు. బాబును రీహాబిలిటేషన్ సెంటర్ కు తరలించబోతున్నారు.
గాయపడినప్పట్నుంచి కిమ్స్ లోనే చికిత్స పొందుతున్నాడు శ్రీతేజ. రీసెంట్ గా అతడికి కృత్రిమ శ్వాస అందించడం నిలిపేశారు. తనకుతానుగా శ్వాస తీసుకుంటున్నాడు. పైగా వైద్యులు చేస్తున్న ఫిజియోథెరపీకి కూడా స్పందిస్తున్నాడు.
కాబట్టి అతడ్ని రీహాబిలిటేషన్ సెంటర్ కు తరలించి రోబోటిక్ ఫిజియోథెరపీ అందిస్తే త్వరగా కోలుకునే అవకాశం ఉందని వైద్యులు భావిస్తున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.
తనకుతానుగా శ్వాస తీసుకుంటున్న శ్రీతేజ్, ఇంకా కుటుంబ సభ్యుల్ని గుర్తుపట్టడం లేదు. పైగా ఆహారం కూడా తీసుకోలేకపోతున్నాడు. పైప్ ద్వారానే అతడికి ఆహారం అందిస్తున్నారు. ఫిజియోథెరపీ తర్వాత పరిస్థితిలో మార్పు వస్తుందని భావిస్తున్నారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. తన కొడుకును రక్షించే క్రమంలో ఆమె మరణించింది. ఆ ఘటనలో ఆక్సిజన్ అందక శ్రీతేజ్ మెదడు భాగం దెబ్బతింది. అతడు కోలుకోవడానికి మరికొన్ని నెలల సమయం పట్టొచ్చని చెబుతున్నారు వైద్యులు.
ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా "వార్ 2" టీజర్ రాబోతుంది అని ఆ… Read More
హీరో విశాల్, హీరోయిన్ సాయిధన్సిక పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని వాళ్లిద్దరూ అధికారికంగా ప్రకటించారు. ఆగస్ట్ 29న విశాల్-ధన్సిక పెళ్లి.… Read More
మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ అన్నదమ్ముల మధ్య ఇప్పటికే మంటలు రేగి… Read More
నటీనటులు స్క్రీన్ పై పేర్లు మార్చుకోవడం కామన్. కమల్ హాసన్, చిరంజీవి, రజనీకాంత్ లాంటి ఎంతోమంది స్టార్స్ పేర్లు మార్చుకున్నారు.… Read More
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఇక థియేటర్లు మూతపడుతాయి. జూన్ 1 నుంచి థియేటర్లను బంద్ చెయ్యాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు.… Read More
పవన్ చేసే ప్రతి సినిమా వెనక త్రివిక్రమ్ ఉంటారు. పవన్ ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉంటే ఆయనకు సినిమాలు సెట్… Read More