గోపీచంద్ తో ‘విశ్వం’ సినిమా చేశాడు శ్రీనువైట్ల. ఈ మూవీ తర్వాత అతడు ఏం చేయబోతున్నాడు? ‘విశ్వం’ రిజల్ట్ చూసి కొత్త సినిమా ప్రకటిస్తాడా? లేక ఆల్రెడీ మరో సినిమా పనిలో ఉన్నాడా?
దీనికి సంబంధించి అతడు వివరాలు వెల్లడించాడు.
“వెంకీ లాంటి సినిమా తీస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుకునే సినిమా వస్తోంది. ఇంకా చెప్పాలంటే వెంకీ ఫస్టాఫ్ లో కామెడీ పీక్ లో ఉంటుంది. సెకండాఫ్ లో క్రైమ్ వల్ల కొంచెం కామెడీ తగ్గుతుంది. కానీ నెక్ట్స్ నేను చేయబోయే సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ ఉంటుంది. ఫస్టాఫ్ లో ఎంత కామెడీ ఉంటుందో, దానికి మించిన కామెడీ సెకెండాఫ్ లో ఉంటుంది.”
‘వెంకీ’ సినిమా నుంచి స్ఫూర్తి పొంది తన కొత్త సినిమాకు కథ రాసుకున్నానని, వెంకీ కంటే బెటర్ గా అది ఉంటుందని చెబుతున్నాడు వైట్ల.
అయితే అది ‘వెంకీ’ సినిమాకు పార్ట్-2 మాత్రం కాదని, పూర్తిగా కొత్త కథ అని కూడా క్లారిటీ ఇచ్చాడు.
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More
పవన్ కల్యాణ్ లో నటుడు మాత్రమే కాదు.. ఓ దర్శకుడు, సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్, స్టంట్ మాస్టర్, లిరిసిస్ట్ కూడా… Read More
అప్పట్లో తెల్లచీరకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది శ్రీదేవి. ఆమె తెల్లచీర కడితే ప్రేక్షక లోకం ఊగిపోయేది. ఆ తర్వాత… Read More
త్రివిక్రమ్-చరణ్ కాంబినేషన్ పై ఇటీవల వార్తలొచ్చాయి. తెలుగుసినిమా.కామ్ ఎక్స్ క్లూజివ్ గా రాసింది కూడా. బన్నీతో సినిమా ఇప్పట్లో లేకపోవడంతో…… Read More