‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా పెద్ద హిట్టయింది. భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చింది. అక్కడ కూడా హిట్టయింది. తర్వాత టీవీల్లోకొచ్చి అక్కడ కూడా హిట్టయింది. ఇలా ఆ సినిమా రన్ అన్ని విభాగాల్లో ముగిసినప్పటికీ, కోర్టులో మాత్రం మొన్నటివరకు ఈ సినిమాపై పెట్టిన కేసు నడుస్తూనే ఉంది. ఎట్టకేలకు అది కూడా క్లియర్ అయింది.
ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు పెంచారు. లెక్కప్రకారం, భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే టికెట్ రేట్ల పెంపు ఇస్తారు. ఈ సినిమాకు భారీబడ్జెట్ ఖర్చవ్వలేదని, కాబట్టి టికెట్ రేట్ల పెంపు నిర్ణయం సమంజసం కాదంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది.
ఈ సినిమా బడ్జెట్ పై ఈడీతో దర్యాప్తు చేయించాలంటూ లక్ష్మణ కుమార్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఇది కోర్టు పరిధిలోకి రాదని, అధికారుల్ని సంప్రదించాలని పిటిషనర్ కు సూచించింది. పైగా ఈ కేసు దాఖలు చేయడం వెనక ప్రజోపయోగం కంటే, సొంత ప్రచారం చేసుకోవాలనే ఉద్దేశం కనిపిస్తోదంటూ అనుమానం కూడా వ్యక్తం చేసింది.
మరీ ముఖ్యంగా సినిమాకు సంబంధించి అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాయని, ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సినిమా గురించి విచారించడం అనవసరమని కోర్టు అభిప్రాయపడింది. ఈ సినిమా రిలీజైన టైమ్ లోనే ఆదాయపు పన్నుశాఖ అధికారులు, దిల్ రాజు నివాసాలు, ఆస్తులు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. ఇదే విషయాన్ని దిల్ రాజు తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More