‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా పెద్ద హిట్టయింది. భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చింది. అక్కడ కూడా హిట్టయింది. తర్వాత టీవీల్లోకొచ్చి అక్కడ కూడా హిట్టయింది. ఇలా ఆ సినిమా రన్ అన్ని విభాగాల్లో ముగిసినప్పటికీ, కోర్టులో మాత్రం మొన్నటివరకు ఈ సినిమాపై పెట్టిన కేసు నడుస్తూనే ఉంది. ఎట్టకేలకు అది కూడా క్లియర్ అయింది.
ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు పెంచారు. లెక్కప్రకారం, భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే టికెట్ రేట్ల పెంపు ఇస్తారు. ఈ సినిమాకు భారీబడ్జెట్ ఖర్చవ్వలేదని, కాబట్టి టికెట్ రేట్ల పెంపు నిర్ణయం సమంజసం కాదంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది.
ఈ సినిమా బడ్జెట్ పై ఈడీతో దర్యాప్తు చేయించాలంటూ లక్ష్మణ కుమార్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఇది కోర్టు పరిధిలోకి రాదని, అధికారుల్ని సంప్రదించాలని పిటిషనర్ కు సూచించింది. పైగా ఈ కేసు దాఖలు చేయడం వెనక ప్రజోపయోగం కంటే, సొంత ప్రచారం చేసుకోవాలనే ఉద్దేశం కనిపిస్తోదంటూ అనుమానం కూడా వ్యక్తం చేసింది.
మరీ ముఖ్యంగా సినిమాకు సంబంధించి అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాయని, ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సినిమా గురించి విచారించడం అనవసరమని కోర్టు అభిప్రాయపడింది. ఈ సినిమా రిలీజైన టైమ్ లోనే ఆదాయపు పన్నుశాఖ అధికారులు, దిల్ రాజు నివాసాలు, ఆస్తులు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. ఇదే విషయాన్ని దిల్ రాజు తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More