కొడుకు ప్రయోజకుడైతే ఏ తల్లికైనా ఆనందమే. రేణు దేశాయ్ ఇప్పుడా ఫీలింగ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీని అకిరా కలవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం, పక్కన నిలబడి ఫొటో దిగడంతో రేణు దేశాయ్ ఆనందానికి అవధుల్లేవ్.
“ఒక తల్లిగా నాకు ఎనలేని సంతోషాన్నిచ్చిన సందర్భం… కల్యాణ్ గారితో వెళ్లిన అకిరా, నరేంద్ర మోడీ గారిని కలిసి వారితో ఫోటో దిగడం. వ్యక్తిగతంగా నాకు బీజేపీ, మోడీ గారంటే చాలా అభిమానం. అలాంటిది ఈరోజు ఈ ఫోటో చూస్తుంటే నా మనసు ఉద్వేగానికి గురైంది. నా కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. నా హృదయం నిండిపోయింది. అకిరా ని ఆశీర్వదించిన మోడీ గారికి ధాన్యవాదాలు. అలాగే అకిరా మీద ఇంత ప్రేమ కురిపిస్తున్న మీ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు.”
ఇలా తన ఆనందాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేసింది రేణుదేశాయ్. ఈ సందర్భంగా మోదీ-అకిరా కలిసి దిగిన ఫొటోను కూడా ఆమె చేసింది. ఆంధ్రప్రదేశ్ లో జనసేన విజయం సాధించింది. కూటమి అధికారంలోకి రావడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా కొడుకు అకిరా, భార్య అన్నా లెజనెవాతో కలిసి ప్రధాని మోదీని కలిశారు పవన్. ఈ సందర్భాన్ని రేణు దేశాయ్ సెలబ్రేట్ చేసుకున్నారు.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More