న్యూస్

చరణ్ విగ్రహంతో మెగా ఫ్యామిలీ

Published by

రామ్ చరణ్‌ మైనపు విగ్రహాన్ని ఇటీవల లండన్ లో ఆవిష్కరించారు. మేడమ్ టుస్సాడ్స్ లండన్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి చరణ్, ఆయన భార్య, కూతురు వెళ్లారు. చరణ్ తల్లితండ్రులు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ కూడా హాజరయ్యారు.

ఆవిష్కరణ అనంతరం రామ్ చరణ్ మైనపు విగ్రహంతో మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఫోటోలు తీసుకొంది. ఈ  ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రామ్ చరణ్ మైనం విగ్రహం ప్రత్యేకత ఏంటంటే… ఆయనతో పాటు ఆయన పెంపుడు కుక్కని కూడా అక్కడ ప్రతిష్టించారు. ఈ మ్యూజియంలో క్వీన్ ఎలిజిబెత్ తర్వాత పెంపుడు కుక్కతో మైనం విగ్రహం పొందిన ఏకైక సెలెబ్రిటీగా రామ్ చరణ్ రికార్డు సృష్టించారు.

రామ్ చరణ్ భార్య చాలా ఆనందంగా ఉన్నారు. ఆమె ఎక్కువ ఫోటోలు దిగడం విశేషం. “నిజమైన భర్త కన్న ఈ వాక్స్ భర్త బాగున్నాడు,” అంటూ ఉపాసన జోక్ చేసింది. ఆ ఫోటోలను, వీడియోలను ఇన్ స్టాగ్రామ్ లో ఉపాసన షేర్ చేసింది.

Recent Posts

అటెన్షన్ అంతా కియరాదే

ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా "వార్ 2" టీజర్ రాబోతుంది అని ఆ… Read More

May 20, 2025

విశాల్ కాబోయే భార్య: ఎవరీ ధన్సిక?

హీరో విశాల్, హీరోయిన్ సాయిధన్సిక పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని వాళ్లిద్దరూ అధికారికంగా ప్రకటించారు. ఆగస్ట్ 29న విశాల్-ధన్సిక పెళ్లి.… Read More

May 19, 2025

శివయ్య అని పిలిస్తే రాడు!

మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ అన్నదమ్ముల మధ్య ఇప్పటికే మంటలు రేగి… Read More

May 19, 2025

ఇవానా అసలు పేరు ఏంటంటే

నటీనటులు స్క్రీన్ పై పేర్లు మార్చుకోవడం కామన్. కమల్ హాసన్, చిరంజీవి, రజనీకాంత్ లాంటి ఎంతోమంది స్టార్స్ పేర్లు మార్చుకున్నారు.… Read More

May 19, 2025

జూన్ 1 నుంచి థియేటర్లు బంద్!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఇక థియేటర్లు మూతపడుతాయి. జూన్ 1 నుంచి థియేటర్లను బంద్ చెయ్యాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు.… Read More

May 18, 2025

హరిహర వీరమల్లులో త్రివిక్రమ్

పవన్ చేసే ప్రతి సినిమా వెనక త్రివిక్రమ్ ఉంటారు. పవన్ ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉంటే ఆయనకు సినిమాలు సెట్… Read More

May 17, 2025