రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో నిన్నటివరకు రాజ్ తరుణ్ దే పైచేయి. ఎఁదుకంటే, పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. అయితే ఇదంతా నిన్నటివరకు. ఈరోజు లావణ్య పైచేయి సాధించింది.
లావణ్యకు నార్సింగి పోలీసులు అండగా నిలిచారు. ఆమె ఇచ్చిన సమాచారం, చూపించిన సాక్ష్యాధారాల్ని పోలీసులు పూర్తిగా నమ్మారు. అందుకే రాజ్ తరుణ్ పై ఛార్జ్ షీట్ తెరిచారు. రాజ్-లావణ్య పదేళ్లు సహజీవనం చేసినట్టు అందులో పొందుపర్చిన పోలీసులు, దానికి సంబంధించి లావణ్య సమర్పించిన ఆధారాలపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది.
కోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ గడువు ముగిసేలోపు రాజ్ తరుణ్ ఏదో ఒకటి చేయాలి. లేదంటే పోలీసులు రంగంలోకి దిగుతారు. త్వరలోనే ఈ ఛార్జ్ షీట్ ను ఆధారాలతో పాటు కోర్టుకు సమర్పించబోతున్నారు పోలీసులు.
మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై స్పందించేందుకు మరోసారి మీడియా ముందుకొచ్చింది లావణ్య. పలు సందర్భాల్లో రాజ్ తరుణ్ కు తన 70 లక్షల రూపాయలిచ్చినట్టు ఆరోపించింది. తన తల్లిదండ్రులు 2 స్థలాలు అమ్మి, ఆ డబ్బును సమకూర్చారని.. వాటికి సంబంధించిన లావాదేవీల పత్రాలన్నీ సిద్ధంగా ఉన్నాయని తెలిపింది.
దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా పరిశ్రమకు వచ్చి 25 ఏళ్ళు. మొదటి చిత్రం "డాలర్ డ్రీమ్స్" 2000వ సంవత్సరంలో విడుదలైంది.… Read More
బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా ప్రస్తుతం "రానా నాయుడు 2" (Rana Naidu 2)ను ప్రమోట్ చేస్తోంది. వెంకటేష్, రానా… Read More
మలైక అరోరా వయసు 51 ఏళ్ళు. కానీ ఆమె ఫిజిక్ చూస్తే 30 ఏళ్ల యువతిలా ఉంటుంది. సాధారణంగా సినిమా… Read More
రాశి ఖన్నా ఆధ్యాత్మిక జీవన విధానం అలవర్చుకుంటోంది. ఆమె ఇప్పుడు ఓషో పుస్తకాలు చదువుతోంది. ఓషో ఒకప్పుడు భారతదేశంలో పేరొందిన… Read More
సైలెంట్ గా తన సినిమాల్ని పూర్తి చేస్తున్నారు పవన్ కల్యాణ్. ఓవైపు రాజకీయ కార్యకలాపాలు చూసుకుంటూనే మరోవైపు సినిమాల్ని పూర్తిచేసే… Read More
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటించిన 'భైరవం' సినిమా రేపు (మే 30) విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన ఒక… Read More