రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో నిన్నటివరకు రాజ్ తరుణ్ దే పైచేయి. ఎఁదుకంటే, పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. అయితే ఇదంతా నిన్నటివరకు. ఈరోజు లావణ్య పైచేయి సాధించింది.
లావణ్యకు నార్సింగి పోలీసులు అండగా నిలిచారు. ఆమె ఇచ్చిన సమాచారం, చూపించిన సాక్ష్యాధారాల్ని పోలీసులు పూర్తిగా నమ్మారు. అందుకే రాజ్ తరుణ్ పై ఛార్జ్ షీట్ తెరిచారు. రాజ్-లావణ్య పదేళ్లు సహజీవనం చేసినట్టు అందులో పొందుపర్చిన పోలీసులు, దానికి సంబంధించి లావణ్య సమర్పించిన ఆధారాలపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది.
కోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ గడువు ముగిసేలోపు రాజ్ తరుణ్ ఏదో ఒకటి చేయాలి. లేదంటే పోలీసులు రంగంలోకి దిగుతారు. త్వరలోనే ఈ ఛార్జ్ షీట్ ను ఆధారాలతో పాటు కోర్టుకు సమర్పించబోతున్నారు పోలీసులు.
మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై స్పందించేందుకు మరోసారి మీడియా ముందుకొచ్చింది లావణ్య. పలు సందర్భాల్లో రాజ్ తరుణ్ కు తన 70 లక్షల రూపాయలిచ్చినట్టు ఆరోపించింది. తన తల్లిదండ్రులు 2 స్థలాలు అమ్మి, ఆ డబ్బును సమకూర్చారని.. వాటికి సంబంధించిన లావాదేవీల పత్రాలన్నీ సిద్ధంగా ఉన్నాయని తెలిపింది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More