హీరో రాజ్ తరుణ్ ఏమైపోయాడు అని మనం ఇటీవలే అనుకున్నాం. గతేడాది తన మాజీ ప్రియురాలు లావణ్య వేసిన కేసు, ఆ వివాదంతో చాన్నాళ్లు వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత విడుదలైన సినిమాలు ఫట్ అనడంతో ఐదు నెలలు మాయం అయ్యాడు. దాంతో, రాజ్ తరుణ్ ఏమైపోయాడు, ఎక్కడున్నాడు అని తెలుగుసినిమా.కామ్ వార్త రాసింది.
నేను ఇక్కడే ఉన్నాను అంటూ ఈ రోజు మీడియా ముందుకొచ్చాడు. మరో కొత్త సినిమాతో వచ్చాడు. రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పాంచ్ మినార్’ అనే సినిమాలో రాజ్ తరుణ్ నటిస్తున్నాడు. ఈ రోజు డైరెక్టర్ మారుతి ఈ మూవీ టీజర్ ని లాంచ్ చేశారు. ఇలా కొంత గ్యాప్ తర్వాత మీడియా ముందుకి కొత్త సినిమా ప్రెస్ మీట్ తో ప్రత్యక్షమయ్యాడు.
“ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది. మా డైరెక్టర్ కష్టం ఆయన విజన్ అట్లా ఉంది. నిర్మాతలు ఈ సినిమాని ఎక్కడ రాజీ పడకుండా నిర్మించారు. రాశి అమేజింగ్ గా నటించింది త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామ”ని రాజ్ తరుణ్ అన్నాడు.
లావణ్య ఇప్పటికే తప్పుడు కేసు పెట్టాను అన్నట్లుగా మాట్లాడింది. కానీ రాజ్ తరుణ్ కెరీర్ రైట్ ట్రాక్ లోకి వస్తుందా అన్నది చూడాలి.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More