హీరో రాజ్ తరుణ్ ఏమైపోయాడు అని మనం ఇటీవలే అనుకున్నాం. గతేడాది తన మాజీ ప్రియురాలు లావణ్య వేసిన కేసు, ఆ వివాదంతో చాన్నాళ్లు వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత విడుదలైన సినిమాలు ఫట్ అనడంతో ఐదు నెలలు మాయం అయ్యాడు. దాంతో, రాజ్ తరుణ్ ఏమైపోయాడు, ఎక్కడున్నాడు అని తెలుగుసినిమా.కామ్ వార్త రాసింది.
నేను ఇక్కడే ఉన్నాను అంటూ ఈ రోజు మీడియా ముందుకొచ్చాడు. మరో కొత్త సినిమాతో వచ్చాడు. రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పాంచ్ మినార్’ అనే సినిమాలో రాజ్ తరుణ్ నటిస్తున్నాడు. ఈ రోజు డైరెక్టర్ మారుతి ఈ మూవీ టీజర్ ని లాంచ్ చేశారు. ఇలా కొంత గ్యాప్ తర్వాత మీడియా ముందుకి కొత్త సినిమా ప్రెస్ మీట్ తో ప్రత్యక్షమయ్యాడు.
“ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది. మా డైరెక్టర్ కష్టం ఆయన విజన్ అట్లా ఉంది. నిర్మాతలు ఈ సినిమాని ఎక్కడ రాజీ పడకుండా నిర్మించారు. రాశి అమేజింగ్ గా నటించింది త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామ”ని రాజ్ తరుణ్ అన్నాడు.
లావణ్య ఇప్పటికే తప్పుడు కేసు పెట్టాను అన్నట్లుగా మాట్లాడింది. కానీ రాజ్ తరుణ్ కెరీర్ రైట్ ట్రాక్ లోకి వస్తుందా అన్నది చూడాలి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More