నటుడు రఘుబాబు పాటలు కూడా పాడాడట. కాకపోతే ఎవరి సంగీత దర్శకత్వంలో పాటలు పాడారో ఆయనకే తెలియదు. లేదా మర్చిపోయారు. దాంతో ఆయన కన్ఫ్యూజ్ అయి మిగతావాళ్ళని కన్ఫ్యూజ్ చేశారు.
“హరి హర వీర మల్లు” సినిమా మొదటి ప్రెస్ మీట్ ఈ రోజు హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమా ఈవెంట్ లో రఘుబాబు మాట్లాడారు. కీరవాణి గురించి పొగుడుతూ “కృష్ణం వందే జగద్గురుమ్” సినిమా కోసం ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో పాట పాడాను అని చెప్పారు రఘుబాబు. వెంటనే కీరవాణి ఆ సినిమాకి తాను సంగీతం అందించలేదని, మణిశర్మ పాటలు కంపోజ్ చేశారని అయన చెవిలో చెప్పారు.
అయినా రఘుబాబు అక్కడితో ఆపకుండా, “ఐతే వేదం సినిమాలో పాడి ఉంటాను” అని కీరవాణితో అన్నారు. దానికి, “అందులో కూడా పడలేదులే” అని సైగ చేశారు.
మొత్తానికి రఘుబాబు తాను కీరవాణికి ఏ పాట పాడానో, ఏ సినిమాలో గొంతు విప్పానో గుర్తుతెచుకోలేకపోయారు. కీరవాణి కూడా రఘుబాబు మాట్లాడుతున్నప్పుడు అయోమయంగానే కనిపించారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More