“డబుల్ ఇస్మార్ట్” విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా చుట్టూ ఎన్నో అనుమానాలున్నాయి, కొన్ని భయాలు కూడా ఉన్నాయి. అయితే ఓ సెక్షన్ మీడియాలో చెప్పుకుంటున్న ఆ భయాలేవీ తనకు లేవంటున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ఒకే ఒక్క విషయంలో మాత్రం తను భయపడినట్టు వెల్లడించాడు.
“డబుల్ ఇస్మార్ట్ కోసం సంజయ్ దత్ ను తీసుకోవాలని అనుకున్నాం. ఆయనకు వెళ్లి కథ వినిపించాం. ఆయనకు నచ్చింది. కానీ కాల్షీట్లు లేవన్నాడు. ఎందుకంటే, అప్పటికే ఆయన 7 సినిమాలకు ఓకే చెప్పారు. అలాంటి టైమ్ లో మాకు కాల్షీట్లు దొరకడం చాలా కష్టం. సంజూ బాబా కాల్షీట్ దొరుకుతుందా దొరకదా అనే భయంతోనే షూటింగ్ మొదలుపెట్టాం.”
ఇలా సినిమా మొత్తం ఈ ఒక్క భయంతోనే గడిచిపోయిందని వెల్లడించాడు పూరి జగన్నాథ్. బహుశా.. అందుకేనేమో.. సంజయ్ దత్ సెట్స్ పైకి వచ్చిన తొలి షెడ్యూల్ లోనే రామ్-సంజయ్ దత్ మధ్య కీలకమైన క్లయిమాక్స్ పార్ట్ షూటింగ్ ను పూర్తిచేశారు.
ఆ తర్వాత సంజయ్ దత్ కాల్షీట్లు, రామ్ అందుబాటులో ఉన్న రోజుల్ని మ్యాచ్ చేసుకొని మిగతా సీన్స్ పూర్తిచేసినట్టు వెల్లడించాడు పూరి జగన్నాథ్. ఆగస్ట్ 15న థియేటర్లలోకి వస్తోంది “డబుల్ ఇస్మార్ట్”.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More