మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇప్పటికే తెలుగులో ప్రభాస్ తో కలిసి నటించాడు. “సలార్” సినిమాలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు రెండో చిత్రంగా రాజమౌళి తీస్తున్న భారీ చిత్రాన్ని ఒప్పుకున్నాడు.
ఈ రోజు నుంచి షూటింగ్ లో పాల్గొంటున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఒడిస్సాలోని కోరాపుట్ జిల్లాలో ప్రస్తుతం షూటింగ్ మొదలైంది. మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ లపై రాజమౌళి కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు.
పృథ్వీరాజ్ సుకుమారన్ పూర్తిగా తెలుగులో డైలాగులు చెప్పబోతున్నాడు. అతను విలన్ గా కనిపిస్తాడు అని టాక్. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కూడా నటిస్తోంది.
పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళంలో క్రేజున్న స్టార్. ఇటీవల మోహన్ లాల్ హీరోగా “ఎల్ 2” అనే సినిమా కూడా డైరెక్ట్ చేశాడు. అది కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More