బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఇటీవల వార్తల్లో వ్యక్తిగా మారారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆమెపై చేసిన ఆరోపణలతో ఒక్కసారిగా ఈ 50 ఏళ్ల నటి సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయారు. ఒక సహకార బ్యాంక్ లో ఆమె తీసుకున్న 18 కోట్ల రుణం మాఫీ అయ్యేలా బీజేపీ ప్రభుత్వం చేసింది కనుకే ప్రీతి బీజేపీని తెగ పొగుడుతోంది అని కేరళ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
ఆ ఆరోపణలు ఆమె గట్టిగా తిప్పి కొట్టింది. ఏకంగా కాంగ్రెస్ జాతీయ నాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపైనే కేసు వేస్తాను అని ఆమె పేర్కొంది. దాంతో ప్రీతి రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రచారం మొదలైంది.
ఐతే తన రాజకీయ అరంగేట్రం గురించి వస్తున్న వార్తలను ప్రీతి తోసిపుచ్చారు. రాజకీయాల్లో చేరేందుకు ఎలాంటి ఆసక్తి లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం, ప్రీతి జింటా అమెరికాలో ఉంటున్నారు. ఒక అమెరికన్ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకొని లాస్ ఏంజెల్స్ లో సెటిల్ అయ్యారు.
“కొన్ని రాజకీయ పార్టీలు గతంలో రాజ్యసభ సీటు ఇస్తామని ఆఫర్ చేశాయి. కానీ నేను సున్నితంగా తిరస్కరించాను. నేను చేసే ప్రతి కామెంట్ ని, నేను పెట్టే ప్రతి పోస్ట్ ని రాజకీయాలకు ముడిపెడ్తున్నారు. కానీ నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు,” అని ప్రీతి జింటా క్లారిటీ ఇచ్చారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More