ఒక దశలో నెంబర్ వన్ గా వెలిగింది హీరోయిన్ పూజ హెగ్డే. ఆ సమయంలో తన విజయాన్ని చూసి కొన్ని శక్తులు కుల్లుకున్నాయి. ఆ కుళ్ళు, అసూయ, ద్వేషంగా మారి తనపై ట్రోలింగ్ చేయించారని తాజాగా తెలిపింది పూజ హెగ్డే.
“తమ పీఆర్ టీంకి చెప్పి ట్రోలింగ్ బ్యాచ్ కి డబ్బులు ఇచ్చి మరి సోషల్ మీడియాలో నాపై బురద జల్లేవారు. మీమ్స్, పోస్టులతో నెగెటివ్ గా మెసేజిలు పెట్టించేవారు. నాపై ట్రోలింగ్ చేసేందుకు వాళ్ళు లక్షలు లక్షలు ఖర్చు పెట్టారని తెలిసినప్పుడు షాక్ అయ్యాను,” అని తెలిపింది పూజ.
ప్రస్తుతం తన కెరీర్ ప్రశాంతంగా సాగుతోందని చెప్తోంది. పూజ హెగ్డే దాదాపు ఏడాదిన్నర పాటు ఖాళీగా ఉంది. తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఐతే, తమిళ, హిందీ చిత్రాలపై ఫోకస్ పెట్టింది.
తమిళంలో ఈ ఏడాది రెండు సినిమాలు విడుదల కానున్నాయి. అలాగే మరో చిత్రం షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక హిందీలో తాజాగా వరుణ్ ధావన్ సరసన సినిమా స్టార్ట్ చేసింది. ట్రోలింగ్, అపజయాల వల్ల ఏడాదిన్నర పాటు వర్క్ లేకుండా ఇంట్లో కూర్చున్న ఈ భామ మళ్ళీ ఇప్పుడు బిజీ బిజీగా మారింది.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More