కొన్ని రోజులుగా హాస్పిటల్ లో ఉన్న దిగ్గజ గాయని పి.సుశీల ఆరోగ్య పరిస్థితిపై చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చెన్నైలోని తన ఇంటికి చేరుకున్నారు.
వెంటనే ఆమె అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. తను ఇంటికి చేరుకున్నానని, వైద్యులు తనను పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేశారని వెల్లడించారు. తన ఆరోగ్యంపై ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపిన ఆమె… తనను అభిమానించే వాళ్లందరికీ ధన్యవాదాలు తెలిపారు.
కొన్ని రోజుల కిందట అస్వస్థతకు గురయ్యారు సుశీల. వెంటనే ఆమెను చెన్నైలోని కావేరీ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. వైద్యులు ఆమెకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె వయసు 88 సంవత్సరాలు. వృద్ధాప్యం వల్ల వచ్చిన ఆరోగ్య సమస్యలతో ఆమె బాధపడుతున్నారు.
తన గాత్రంతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు సుశీల. దాదాపు 10 భాషల్లో 45 వేలకు పైగా పాటలు పాడారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More