ఒడిశా రాష్ట్రంలో తెలుగు సినిమా షూటింగ్ ల సందడి ఎక్కువ అవుతోందట. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తాజాగా తెలుగు ఫిలింమేకర్లను అభినందిస్తూ ట్వీట్ చేశారు.
ఒడిశా ఉప ముఖ్యమంత్రి పార్వతి పరిదా (Pravati Parida) ప్రకారం వాళ్ళ రాష్ట్రంలోని మల్కన్ గిరి ప్రాంతంలో పుష్ప 2 షూటింగ్ జరిగిందట. “ఇప్పుడు రాజమౌళి కోరాపుట్ ప్రాంతంలో మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రాలపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. మా ఒడిశాలో ఎన్నో సుందరమైన ప్రదేశాలు షూటింగ్ లకు అనువుగా ఉన్నాయి,” అని ఆమె పేర్కొన్నారు.
మల్కన్ గిరి, కోరాపుట్ ఒకప్పుడు నక్సల్స్ ప్రాంతాలు. అందుకే, మనవాళ్ళు షూటింగ్ లకు అక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. ఆ ప్రాంతమంతా దట్టమైన అడవి, సరస్సులు, జలపాతాలతో ఉంటుంది. సుందరమైన ప్రదేశమే కానీ నక్సల్స్ కారణంగా ఇంతకుముందు ఎవరూ వెళ్ళలేదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి.
ఒడిశాలో మరిన్ని పెద్ద సినిమాల షూటింగులు జరుగుతాయా అనేది చూడాలి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More