ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో భారీ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే పేరు పరీశీలనలో ఉంది. ఇంకా నిర్మాతలు టైటిల్ అనౌన్స్ చెయ్యలేదు. కానీ ఈ టైటిల్ ని ఇప్పటికే రిజిస్టర్ చేశారు.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కర్ణాటకలోని సముద్రపు తీరాన కొంత భాగం జరిగింది. అక్కడ ఒక పెద్ద యాక్షన్ సీన్ తీశారు. అలాగే హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో కొన్ని సీన్లు చిత్రీకరించారు.
ఇక ఇప్పుడు మరో కీలక సన్నివేశం కోసం ఒక భారీ సెట్ వేస్తున్నారు. ఇక్కడ కూడా ఒక యాక్షన్ తీయనున్నారు. ఎన్టీఆర్ తో పాటు ప్రకాష్ రాజ్ పాల్గొంటారట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్నఈ సినిమాకి భారీ బడ్జెట్ ని కేటాయించారు. ఈసారి పాన్ ఇండియా మార్కెట్ మాత్రమే కాదు వరల్డ్ వైడ్ మార్కెట్ ని టార్గెట్ చేశారు. అందుకే, బడ్జెట్ భారీగా పెంచి గ్రాండ్ గా తీస్తున్నారు.
ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ తీసిన “కేజీఎఫ్”, “సలార్” చిత్రాలు భారీ విజయం సాధించాయి. నీల్ కి రీర్ లో ఇది ఇదో చిత్రం. తెలుగులో ‘సలార్’ తర్వాత రెండో చిత్రం. ‘డ్రాగన్’ పూర్తి అయ్యాక ‘సలార్’ రెండో భాగం మొదలవుతుంది.
నిత్యా మీనన్ ఇచ్చి పడేసింది. సోషల్ మీడియాలో ఒక్కోసారి ఉన్నట్టుండి ఫైర్ అవుతుంది ఈ బ్యూటీ. ఇది కూడా అలాంటి… Read More
మే నెల గడిచిపోయింది. జూన్ లో మరికొన్నిక్రేజీ మూవీస్ వస్తున్నాయి. వీటిలో ముందుగా వస్తున్న సినిమా 'థగ్ లైఫ్'. దాదాపు… Read More
సినిమా రిలీజ్ కు ముందు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెడతారు. పెళ్లికి ముందు ప్రీ-వెడ్డింగ్ షూట్ చేస్తారు. మరి పుట్టినరోజుకు ముందు… Read More
సాధారణంగా మే నెల వేసవి సెలవుల కాలానికి చాలా కీలకం. అసలైన కలెక్షన్లు మేలోనే వస్తాయి. కానీ 2025లో సీన్… Read More
తెలుగు సినిమా కొంతకాలంగా విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. కొత్త సినిమాలకు కలెక్షన్లు ఉండడం లేదు. ఎంత ప్రచారం చేసినా కొన్ని… Read More
దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా పరిశ్రమకు వచ్చి 25 ఏళ్ళు. మొదటి చిత్రం "డాలర్ డ్రీమ్స్" 2000వ సంవత్సరంలో విడుదలైంది.… Read More