మెగా కాంపౌండ్ నుంచి ఓ సినిమా వస్తుందంటే కచ్చితంగా ఆ కాంపౌండ్ హీరోల ప్రచారం ఉంటుంది. అలాంటిది తొలిసారి నిహారిక నిర్మాతగా మారి సినిమా చేస్తోందంటే, ప్రచారం పీక్స్ లో ఉండాలి. కానీ ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదు.
నిహారిక నిర్మాతగా మారి తీసిన తొలి సినిమా “కమిటీ కుర్రాళ్లు.” ఈ సినిమా ప్రచారంలో ఒక్క మెగా హీరో కనిపించలేదు. చివరికి నిహారిక సొంత అన్నయ్య వరుణ్ తేజ్, వదిన లావణ్య త్రిపాఠి కూడా కనిపించలేదు.
దీనిపై నిహారిక స్వయంగా స్పందించింది.
“కష్టపడి సినిమా తీశాను. నేను ఒక్కదాన్నే ప్రచారం చేస్తున్నాను. సినిమా విడుదలకు ముందు మా ఫ్యామిలీ మెంబర్స్ తో ప్రమోషన్ అనుకున్నాను. చూస్తే, అన్నయ్య వైజాగ్ షూట్ లో బిజీగా ఉన్నాడు. వదిన కాలి గాయంతో డెహ్రాడూల్ లో ఉంది. పెదనాన్న చిరంజీవి, రామ్ చరణ్ పారిస్ ఒలింపిక్స్ కు వెళ్లారు. పవన్ కల్యాణ్ అస్సలు దొరకడం లేదు, చివరికి డాడీ కూడా రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఇలా నా సినిమా రిలీజ్ టైమ్ కు అంతా మాయమయ్యారు.”
ALSO CHECK: Niharika Sings “Pachadanamey”
అయితే రిలీజ్ టైమ్ కు ఎలాగైనా మెగా హీరోల్ని ప్రచారంలోకి తీసుకొస్తానంటోంది నిహారిక. చిరంజీవి, చరణ్ ఆల్రెడీ పారిస్ నుంచి ఇంటికొచ్చారు. కాబట్టి సినిమా ప్రచారం కోసం ఓ వీడియో చేయడం పెద్ద సమస్య కాదు.
సాధారణంగా మే నెల వేసవి సెలవుల కాలానికి చాలా కీలకం. అసలైన కలెక్షన్లు మేలోనే వస్తాయి. కానీ 2025లో సీన్… Read More
ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో భారీ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి 'డ్రాగన్' అనే పేరు పరీశీలనలో ఉంది.… Read More
తెలుగు సినిమా కొంతకాలంగా విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. కొత్త సినిమాలకు కలెక్షన్లు ఉండడం లేదు. ఎంత ప్రచారం చేసినా కొన్ని… Read More
దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా పరిశ్రమకు వచ్చి 25 ఏళ్ళు. మొదటి చిత్రం "డాలర్ డ్రీమ్స్" 2000వ సంవత్సరంలో విడుదలైంది.… Read More
బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా ప్రస్తుతం "రానా నాయుడు 2" (Rana Naidu 2)ను ప్రమోట్ చేస్తోంది. వెంకటేష్, రానా… Read More
మలైక అరోరా వయసు 51 ఏళ్ళు. కానీ ఆమె ఫిజిక్ చూస్తే 30 ఏళ్ల యువతిలా ఉంటుంది. సాధారణంగా సినిమా… Read More