ఇన్ స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ ని సాయిధరమ్ తేజ్ అన్ ఫాలో కొట్టిన సంగతి తెలిసిందే. దీనిపై చాలా వివాదం నడుస్తోంది. వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందనేది పక్కనపెడితే.. మీడియా మాత్రం రకరకాల విశ్లేషణలు చేస్తోంది. సాయితేజ్, పవన్ కల్యాణ్ వైపు ఉన్నాడని.. అందుకే వైసీపీకి మద్దతిచ్చిన బన్నీని అన్-ఫాలో కొట్టాడంటూ చెప్పుకొచ్చారు.
ఈ మొత్తం వ్యవహారంపై నిహారిక కొణెదల స్పందించింది. ఈ వివాదం గురించి తనకేమీ తెలియదంటూనే, ఎవరి కారణాలు వాళ్లకు ఉంటాయంటూ రియాక్ట్ అయింది. అంటే, అసలు కారణం ఏంటనేది నిహారికకు తెలిసే ఉండొచ్చన్నమాట.
మెగాకాంపౌండ్ లో వివాదాలు కొత్త కాదు. చిరంజీవి-అల్లు అరవింద్, బన్నీ-చరణ్, పవన్-అల్లు అర్జున్ మధ్య అబిప్రాయబేధాలున్నాయంటూ ఎప్పటికప్పుడు కథనాలు వస్తూనే ఉన్నాయి. అవన్నీ నిజం కాదంటూ వీళ్లు తమ చర్యలతో ఎప్పటికప్పుడు వాటిని ఖండిస్తూనే ఉన్నారు. ఫ్యామిలీ ఫంక్షన్లలో కలిసి ఫొటోలు దిగుతూనే ఉన్నారు.
ఐతే, ఈ సారి ఎన్నికల ఫలితాల తర్వాత స్పష్టమైన తేడా తెలిసింది. బయటికి ఎన్ని చెప్పినా చిరంజీవి-పవన్ కళ్యాణ్ ఒక వైపు, అల్లు అర్జున్ మరోవైపు అని అర్థమైంది. కొన్నాళ్ళకు అందరూ మళ్ళీ కలిసిపోయినా ఆశ్చర్యం లేదు.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More