ప్రతి హీరోకు మరో హీరోతో వింటేజ్ మూమెంట్ ఉంది. ఆది పినిశెట్టికి కూడా బాలకృష్ణతో అలాంటి మూమెంట్ ఒకటి ఉంది. స్వయంగా ఈ నటుడు, ఆ మేటర్ ను బయటపెట్టాడు.
బాలకృష్ణను తొలిసారి “బంగారు బుల్లోడు” సెట్స్ లో కలిశాడంట ఆది పినిశెట్టి. అప్పుడు తను చాలా చిన్నవాడినని, తండ్రితో కలిసి సెట్స్ కు వెళ్లానని చెప్పుకొచ్చాడు. తను చిన్నప్పుడు బాలయ్యలో చూసిన ఎనర్జీ, ఇప్పటికీ అలానే ఉందంటున్నాడు ఆది.
కెరీర్ లో ఫస్ట్ టైమ్ బాలకృష్ణతో కలిసి ‘అఖండ-2’ సినిమా చేస్తున్నాడు ఆది పినిశెట్టి. ఇందులో ఆయన ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. బాలయ్యతో కలిసి నటించడం చాలా బాగుందని, ఆయనలో ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని చెప్పుకొచ్చాడు ఆది.
ఇక ‘అఖండ-2’ విషయానికొస్తే, ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ ఓ షెడ్యూల్ పూర్తి చేశాడట ఆది పినిశెట్టి. త్వరలోనే తన షెడ్యూల్ ఉందని స్పష్టం చేశాడు. ‘ది వారియర్’ సినిమా తర్వాత ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్న మూవీ ఇదే.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More