‘నేనెక్కడున్నా’ సినిమాతో ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి తెలుగు చిత్రసీమకు హీరోగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరి 28న ‘నేనెక్కడున్నా’ విడుదల కానుంది.
“ఇది ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా. మహిళా సాధికారిత, మహిళా జర్నలిజం గురించి మాత్రమే చెప్పలేదు. ఇందులో పాటలు, మంచి యాక్షన్ సీక్వెన్సులు, సన్నివేశాలు ఉన్నాయి. దర్శకుడు మాధవ్ కోదాడ ముంబై వచ్చి నాకు కథ చెప్పారు. కథ విన్న వెంటనే ‘ఎస్’ చెప్పాను. మంచి సందేశంతో కూడిన ఫిల్మ్ మాత్రమే కాదు… నాకు తెలుగులో మంచి డెబ్యూ అవుతుందని అనుకున్నాను,” అని తెలిపారు మిమో.
హీరోగానే కాదు విలన్ పాత్రలకు కూడా మిమో సిద్ధం అంటున్నారు.
మిథున్ చక్రవర్తి ఇప్పటికే తెలుగులో ‘గోపాల గోపాల’ చిత్రంలో చేశారు. “మా నాన్నఇప్పుడు భాస్ గారి ‘ఫౌజీ’ సినిమాలో నటిస్తున్నారు. మేం తండ్రికొడుకుల్లా కాకుండా స్నేహితులుగా ఉంటాం. బయట జనాలకు ఆయన సూపర్ స్టార్. కానీ, నాకు ప్రాక్టికల్ ఫాదర్ అని చెప్పాలి,” అని మిమో వివరించారు.
“పవన్ కళ్యాణ్, ప్రభాస్, దళపతి విజయ్ అంటే ఇష్టం. రజనీకాంత్ అన్నా ఇష్టమే,” అని తన ఫెవరెట్స్ గురించి చెప్పారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More