తన ఫౌండేషన్ ద్వారా ఎప్పుడూ పేదలకు చేయూతనివ్వడానికి సిద్ధంగా ఉంటాడు మహేష్ బాబు. ఇప్పటికే వెయ్యి మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు నిర్వహించి తన పెద్ద మనసు చాటుకున్న ఈ సూపర్ స్టార్.. ఇప్పుడు మరోసారి అదే పని చేశాడు.
తన వీరాభిమానిని ఆదుకున్నాడు మహేష్. కృష్ణా జిల్లా మోపీదేవికి చెందిన రాజేష్ అనే వ్యక్తి మహేష్ అభిమాని. అతడికి మహేష్ అంటే ఎంత అభిమానమంటే.. అర్జున్ సినిమా రిలీజైన టైమ్ లో కొడుకు పుడితే, అతడికి అర్జున్ అని పేరుపెట్టాడు. అతిథి రిలీజ్ టైమ్ లో పుట్టిన కొడుక్కి అదే పేరు పెట్టాడు. ఇక ఆగడు రిలీజైన టైమ్ కు మూడో కొడుకు పుడితే వాడికి ఆగడు అని పేరు పెట్టుకున్నాడు. మహేష్ అంటే అంత పిచ్చి.
అయితే ఈ వీరాభిమాని జబ్బుపడ్డాడు. కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో మంచాన పడ్డాడు. దీంతో పెద్దకొడుకు అర్జున్, చెప్పులు షాపులో పనికి కుదిరాడు. మిగతా ఇద్దరు కొడుకులు చదువు మానేశారు. ఈ విషయం మహేష్ కు తెలిసిందే. వెంటనే మహేష్ టీమ్ ఆ కుటుంబాన్ని సంప్రదించింది. పిల్లల్ని దగ్గర్లోని స్కూల్ లో జాయిన్ చేసింది. వాళ్లకు ప్రతి ఏటా మహేష్ బాబు ఫీజులు కడతాడని, ఏటా తమకు గుర్తుచేస్తే చాలని తెలిపింది. అంతేకాదు, ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సాయం కూడా చేసింది. దటీజ్ మహేష్.
మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు.
రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More