“రాజమౌళి మహాభారతం” ప్రస్తావన ఇప్పటిది కాదు. ఇంకా చెప్పాలంటే దాదాపు దశాబ్దానికి పైగా ఈ చర్చ నలుగుతూనే ఉంది. రాజమౌళి కెరీర్ కు గమ్యస్థానం మహాభారతం అనే విషయం అందరికీ తెలిసింది. ఇప్పుడీ ప్రాజెక్టుపై ఒకేసారి ఇద్దరు స్టేట్ మెంట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
ముందుగా రాజమౌళి దగ్గరకు వద్దాం. “మహాభారతం” ప్రాజెక్టుపై జక్కన్న స్పందించాడు. ఈ సినిమా గురించి ప్రస్తుతం తను ఆలోచించడం లేదని, ఎప్పుడు ఈ ప్రాజెక్టును పట్టాలపైకి తీసుకొచ్చినా అందులో నాని కచ్చితంగా ఉంటాడని వెల్లడించాడు.
అటు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కూడా “మహాభారతం”పై స్పందించారు. గతంలో ఓ సందర్భంలో అమీర్ ఖాన్, “మహాభారతం” ప్రాజెక్టు గురించి తనతో చర్చించారని, ఆ తర్వాత ఏమైందో తనకు తెలియదన్నారు. రాజమౌళి అంతిమ లక్ష్యం “మహాభారతం” అని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.
మరోవైపు “మహాభారతం” ప్రాజెక్టుకు సంబంధించి తెరవెనక పనులు సాగుతున్నాయని కూడా అంటున్నారు. 3 భాగాలుగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి, రాజమౌళి టీమ్ లో కొంతమంది డ్రాఫ్టింగ్ పని మీద ఉన్నట్టు సమాచారం.
ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా "వార్ 2" టీజర్ రాబోతుంది అని ఆ… Read More
హీరో విశాల్, హీరోయిన్ సాయిధన్సిక పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని వాళ్లిద్దరూ అధికారికంగా ప్రకటించారు. ఆగస్ట్ 29న విశాల్-ధన్సిక పెళ్లి.… Read More
మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ అన్నదమ్ముల మధ్య ఇప్పటికే మంటలు రేగి… Read More
నటీనటులు స్క్రీన్ పై పేర్లు మార్చుకోవడం కామన్. కమల్ హాసన్, చిరంజీవి, రజనీకాంత్ లాంటి ఎంతోమంది స్టార్స్ పేర్లు మార్చుకున్నారు.… Read More
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఇక థియేటర్లు మూతపడుతాయి. జూన్ 1 నుంచి థియేటర్లను బంద్ చెయ్యాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు.… Read More
పవన్ చేసే ప్రతి సినిమా వెనక త్రివిక్రమ్ ఉంటారు. పవన్ ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉంటే ఆయనకు సినిమాలు సెట్… Read More