జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ హీరోయిన్ గా ఇప్పటికే పరిచయం అయింది. ఐతే, ఖుషి కపూర్ ఇంకా తెలుగులో కానీ, తమిళంలో కానీ నటించలేదు. ప్రస్తుతం ఈ అక్కాచెల్లెళ్ళ ఫోకస్ వేరుగా ఉంది.
జాన్వీ కపూర్ మొదట బాలీవుడ్ చిత్రాల్లో నటించి ఇప్పుడు తెలుగు సినిమాలపై ఎక్కువ దృష్టి నిలిపింది. ఇప్పటికే ‘దేవర’ సినిమాలో నటించిన ఈ భామ తాజాగా రామ్ చరణ్ కొత్త సినిమా చేస్తోంది. అలాగే, ‘దేవర 2’ (ఒకవేళ ఉంటే) కూడా ఉంది. ఈ 2025లో మరో రెండు దక్షిణాది చిత్రాలు (ఒకటి తమిళం, ఒకటి తెలుగు) ఆమె ఖాతాలో చేరుతాయని ఆమె పీఆర్ టీం చెప్తోంది.
ఇక ఖుషి కపూర్ తాజాగా అమీర్ ఖాన్ కొడుకు జునైదు ఖాన్ హీరోగా రూపొందుతోన్న కొత్త చిత్రాన్ని సైన్ చేసింది. ఇది తమిళ సూపర్ హిట్ చిత్రం “లవ్ టుడే”కి రీమేక్. సౌత్ నుంచి హిందీలోకి రీమేక్ అయ్యే సినిమాలతో బాలీవుడ్లో బిజీ అవుతోంది ఖుషి.
జాన్వీ కపూర్ హీరోయిన్ గా అడుగుపెట్టిన ఐదేళ్ల తర్వాత తెలుగులో నటించింది. సో, ఖుషి కూడా మరికొన్నాళ్లు బాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకొని సౌత్ లోకి అడుగుపెడుతుంది కాబోలు.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More