జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ హీరోయిన్ గా ఇప్పటికే పరిచయం అయింది. ఐతే, ఖుషి కపూర్ ఇంకా తెలుగులో కానీ, తమిళంలో కానీ నటించలేదు. ప్రస్తుతం ఈ అక్కాచెల్లెళ్ళ ఫోకస్ వేరుగా ఉంది.
జాన్వీ కపూర్ మొదట బాలీవుడ్ చిత్రాల్లో నటించి ఇప్పుడు తెలుగు సినిమాలపై ఎక్కువ దృష్టి నిలిపింది. ఇప్పటికే ‘దేవర’ సినిమాలో నటించిన ఈ భామ తాజాగా రామ్ చరణ్ కొత్త సినిమా చేస్తోంది. అలాగే, ‘దేవర 2’ (ఒకవేళ ఉంటే) కూడా ఉంది. ఈ 2025లో మరో రెండు దక్షిణాది చిత్రాలు (ఒకటి తమిళం, ఒకటి తెలుగు) ఆమె ఖాతాలో చేరుతాయని ఆమె పీఆర్ టీం చెప్తోంది.
ఇక ఖుషి కపూర్ తాజాగా అమీర్ ఖాన్ కొడుకు జునైదు ఖాన్ హీరోగా రూపొందుతోన్న కొత్త చిత్రాన్ని సైన్ చేసింది. ఇది తమిళ సూపర్ హిట్ చిత్రం “లవ్ టుడే”కి రీమేక్. సౌత్ నుంచి హిందీలోకి రీమేక్ అయ్యే సినిమాలతో బాలీవుడ్లో బిజీ అవుతోంది ఖుషి.
జాన్వీ కపూర్ హీరోయిన్ గా అడుగుపెట్టిన ఐదేళ్ల తర్వాత తెలుగులో నటించింది. సో, ఖుషి కూడా మరికొన్నాళ్లు బాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకొని సౌత్ లోకి అడుగుపెడుతుంది కాబోలు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More