కాయదు లోహర్… ఇటీవల కుర్రకారు కన్నుకి నచ్చిన సుందరి. తమిళ యువ హీరో ప్రదీప్ రంగనాథన్ సరసన “రిటర్న్ ఆఫ్ డ్రాగన్” అనే చిత్రంలో నటించింది. అనుపమ ఒక హీరోయిన్ కాగా కాయదు లోహర్ మరో భామ. ఆమె అందచందాలు యువ ప్రేక్షకులను గిలిగింతలు పెట్టాయి. దాంతో ఆమెకి తమిళనాడులో క్రేజ్ వచ్చింది.
కాయదు ఇప్పుడు రెండో పెద్ద సినిమా ఒప్పుకొంది. శింబు హీరోగా రూపొందుతోన్న ఆయన 49వ చిత్రంలో కాయదు హీరోయిన్. ఈ సినిమా ఈ రోజు లాంఛనంగా ప్రారంభం అయింది. శింబు సరసన ఛాన్స్ రావడంతో ఆమెకి మరిన్ని బడా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు.
పాతికేళ్ల ఈ సుందరి మూడేళ్ళ క్రితం “అల్లూరి” అనే తెలుగు సినిమాలో నటించింది. శ్రీ విష్ణు హీరోగా నటించాడు అందులో. కానీ ఆ సినిమా ఆడలేదు. తెలుగు జనం కూడా ఆమెని పట్టించుకోలేదు. తమిళంలో నటించి క్రేజ్ తెచ్చుకొంది. ఇప్పుడు రెండు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి.
ఈ భామ తెలుగులో కూడా అవకాశాల కోసం చూస్తోంది. ఇప్పటికే మలయాళంలో రెండు సినిమాలు చేసింది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More