కాయదు లోహర్… ఇటీవల కుర్రకారు కన్నుకి నచ్చిన సుందరి. తమిళ యువ హీరో ప్రదీప్ రంగనాథన్ సరసన “రిటర్న్ ఆఫ్ డ్రాగన్” అనే చిత్రంలో నటించింది. అనుపమ ఒక హీరోయిన్ కాగా కాయదు లోహర్ మరో భామ. ఆమె అందచందాలు యువ ప్రేక్షకులను గిలిగింతలు పెట్టాయి. దాంతో ఆమెకి తమిళనాడులో క్రేజ్ వచ్చింది.
కాయదు ఇప్పుడు రెండో పెద్ద సినిమా ఒప్పుకొంది. శింబు హీరోగా రూపొందుతోన్న ఆయన 49వ చిత్రంలో కాయదు హీరోయిన్. ఈ సినిమా ఈ రోజు లాంఛనంగా ప్రారంభం అయింది. శింబు సరసన ఛాన్స్ రావడంతో ఆమెకి మరిన్ని బడా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు.
పాతికేళ్ల ఈ సుందరి మూడేళ్ళ క్రితం “అల్లూరి” అనే తెలుగు సినిమాలో నటించింది. శ్రీ విష్ణు హీరోగా నటించాడు అందులో. కానీ ఆ సినిమా ఆడలేదు. తెలుగు జనం కూడా ఆమెని పట్టించుకోలేదు. తమిళంలో నటించి క్రేజ్ తెచ్చుకొంది. ఇప్పుడు రెండు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి.
ఈ భామ తెలుగులో కూడా అవకాశాల కోసం చూస్తోంది. ఇప్పటికే మలయాళంలో రెండు సినిమాలు చేసింది.
ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా "వార్ 2" టీజర్ రాబోతుంది అని ఆ… Read More
హీరో విశాల్, హీరోయిన్ సాయిధన్సిక పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని వాళ్లిద్దరూ అధికారికంగా ప్రకటించారు. ఆగస్ట్ 29న విశాల్-ధన్సిక పెళ్లి.… Read More
మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ అన్నదమ్ముల మధ్య ఇప్పటికే మంటలు రేగి… Read More
నటీనటులు స్క్రీన్ పై పేర్లు మార్చుకోవడం కామన్. కమల్ హాసన్, చిరంజీవి, రజనీకాంత్ లాంటి ఎంతోమంది స్టార్స్ పేర్లు మార్చుకున్నారు.… Read More
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఇక థియేటర్లు మూతపడుతాయి. జూన్ 1 నుంచి థియేటర్లను బంద్ చెయ్యాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు.… Read More
పవన్ చేసే ప్రతి సినిమా వెనక త్రివిక్రమ్ ఉంటారు. పవన్ ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉంటే ఆయనకు సినిమాలు సెట్… Read More